వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'రూ.500కు నాణ్యమైన మంచి చీర వచ్చేది, కేసీఆర్ పరువు పోగొట్టుకున్నారు'

బతుకమ్మ పండుగ సందర్భంగా ఇచ్చిన చీరలపై పలువురు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విపక్షాలు అధికార పార్టీపై నిప్పులు చెరుగుతున్నాయి. చీరల విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బతుకమ్మ పండుగ సందర్భంగా ఇచ్చిన చీరలపై పలువురు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చీరలు మీ కూతురు కవితకు ఇవ్వాలని మహిళలు విమర్శలు గుప్పిస్తున్నారు.

సిగ్గుందా: కేటీఆర్‌పై డీకే అరుణ తిట్ల వర్షం, రూ.150 కోట్లంటూ సంచలనంసిగ్గుందా: కేటీఆర్‌పై డీకే అరుణ తిట్ల వర్షం, రూ.150 కోట్లంటూ సంచలనం

పక్షాలు అధికార పార్టీపై నిప్పులు చెరుగుతున్నాయి. చీరల విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇది కదా అసలు బాగోతం?: బతుకమ్మ చీరల 'డీలింగ్' వెనుక ఇంత జరిగిందా!..

నాసిరకం చీరలు

నాసిరకం చీరలు

మహిళలకు బతుకమ్మ కానుక పేరుతో టిఆర్ఎస్ ప్రభుత్వం పంపిణీ చేసే చీరలు నాసిరకంగా ఉన్నాయని, వాటితోపాటు ఆ పార్టీ కూడా నాసిరకమేనని తెలంగాణ ప్రదేశ్‌ కమిటీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు.

రూ.500 పెడితే నాణ్యమైన చీరలు వచ్చేవి

రూ.500 పెడితే నాణ్యమైన చీరలు వచ్చేవి

రూ.500 పెడితే నాణ్యమైన చీరలు వచ్చేవని, నాసిరకం చీరలను పంపిణీ చేసి రాష్ట్ర ప్రభుత్వం మహిళలను అగౌరవపరిచిందని, పరువు పోగొట్టుకున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిన టిఆర్ఎస్‌ను ఇంటికి పంపే సమయం ఆసన్నమైందన్నారు. ఇందుకు కార్యకర్తలు సమాయత్తం కావాలన్నారు.

ఇప్పుడు, బర్రెలు, గొర్రెలు అంటున్నారు

ఇప్పుడు, బర్రెలు, గొర్రెలు అంటున్నారు

తెలంగాణలో సుమారు నాలుగు లక్షల మంది కాంగ్రెస్‌ కార్యకర్తలతో త్వరలోనే రాహుల్‌ గాంధీ ఫోన్‌లో సంభాషిస్తారని ఉత్తమ్ తెలిపారు. 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ విస్మరించి ఇప్పుడు చేపలు, గొర్రెలు, బర్రెలు అంటూ ప్రజలను మోసం చేస్తోన్నారన్నారు.

ఇదీ కేసీఆర్ నిజస్వరూపం

ఇదీ కేసీఆర్ నిజస్వరూపం

జయశంకర్‌ భూపాలపల్లిలో రైతులను పోలీసులు చెట్టుకు కట్టేశారని, ఖమ్మంలో మిర్చి రైతులను సంకెళ్లు వేసి తీసుకెళ్లడం ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిజస్వరూపానికి నిదర్శనం అన్నారు. రైతుల ఆగ్రహాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి వచ్చే ఏడాది నుంచి ఎకరాకు రూ.4 వేలు పెట్టుబడిస్తామంటూ ప్రకటించారని, అది ఇప్పటి నుంచే ప్రారంభించాలన్నారు.

English summary
Telangana Chief Minister K Chandrashekhar Rao’s much publicized free saree drive turned into a free-for-all on Monday as women came to blows with each other at distribution centres over the long wait. The gift itself was rejected by most women as they complained of the “low quality” of the sarees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X