మరో 3,4డిగ్రీలు అధికంగా..: హైదరాబాద్ లో పెరగనున్న ఉష్ణోగ్రతలు
హైదరాబాద్: నగరంలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు బేగంపేట వాతావరణ శాఖాధికారులు తెలిపారు. రాబోయే రెండు, మూడు రోజుల్లో నగరంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇటీవల కురిసిన వర్షాలతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ.. భానుడు మళ్లీ తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మే నెలలో సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల అధికంగా వాతావరణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
కాగా, గత 5రోజుల్లో హైదరాబాద్ నగరంలో.. 40.7, 39.3, 39.0, 35.5, 39.0డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కనిష్టంగా 25.8, 27.3, 25.8, 21.9, 26.9డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
Comments
English summary
With the city's maximum temperature touching a sweltering, the local office of the Indian Meteorological Department (IMD) issued a three-day high temperature warning across Telangana.
Story first published: Tuesday, May 8, 2018, 7:39 [IST]