ఆయనే మాకు దేవుడు: కేసీఆర్కు గుడికట్టిన అభిమాని
నల్గొండ: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్పై ఓ కానిస్టేబుల్ తన అభిమానాన్ని చాటుకున్నాడు. సీఎం కేసీఆర్కు గుడి కట్టి తన వీరాభిమానాన్ని చాటుకున్నాడు. నల్గొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రం శ్రీనివాస్ అనే వ్యక్తి పోలీసుశాఖలో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
సీఎం కేసీఆర్ పాలనకు ముగ్ధుడైన శ్రీనివాస్ గుడి కట్టి తన అభిమానాన్ని చాటాడు. సీఎం కేసీఆర్ నాలుగున్నర ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి సాధించిందన్నారు. గత 60 ఏళ్ల పాలనలో జరగని అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వ ఈ నాలుగున్నరేండ్ల పాలనలో జరిగిందన్నారు.
ఇది ఇలా ఉండగా, భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని ఇంద్రియాల గ్రామం, మొర్రికుంట తండాకు చెందిన 52 కుటుంబాలు, బుడిగె జంగాల, ఎస్సి, మాల కాలనీలకు చెందిన 500 మంది టీఆర్ఎస్ కే తమ ఓటు వేస్తామని స్పష్టం చేశారు. భువనగిరి ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్న ఫైళ్ల శేఖర్ రెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని వారంతా ఏకగ్రీవ తీర్మానం చేశారు.