వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్లకు హైకోర్టులో తాత్కాలిక ఊరట
హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్పై హెడ్ఫోన్స్ విసిరి దాడి చేసిన అంశంలో కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ల సభ్యత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై వారు హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయా నేతల నియోజకవర్గాలైన నల్గొండ, అలంపూర్ ఎన్నికలకు ఇప్పుడే నోటిఫికేషన్ ఇవ్వొద్దని ఆదేశించింది.
కనీసం ఆరు వారాల వరకు ఆగాలని సూచించింది. ఈ కేసులో తదుపరి విచారణ 26వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఈ వివాదంపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్కు లేదని, సభ్యత్వం రద్దు చేయాలంటే ముందు ఎథిక్స్ కమిటీకి సమస్య ను నివేదించాలని ఎటువంటి నిబంధనలు పాటించకుండానే తమ సభ్యత్వాలను రద్దు చేశారని వారు చెబుతున్నారు.
Comments
komatireddy venkat reddy sampath kumar telangana high court kcr k chandrasekhar rao కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంపత్ కుమార్ తెలంగాణ హైకోర్టు కేసీఆర్ కే చంద్రశేఖర రావు
English summary
Temporary relief to Komatireddy Venkat Reddy and Sampath Kumar in High Court.
Story first published: Monday, March 19, 2018, 18:32 [IST]