బాంబులు తయారీ చేయడంలో దిట్ట సయ్యద్ అబ్దుల్ కరీం తుండా, భారత్ నుంచి ఉగ్రవాదం వైపు..
హైదరాబాద్ బాంబ్ పేలుళ్ల కేసులతో సంబంధం ఉన్న లష్కరే తోయిబా ఉగ్రవాది సయ్యద్ అబ్దుల్ కరీం తుండాకు నాంపల్లి కోర్టు మంగళవారం శిక్ష విధించనుంది. చంచల్గూడ జైలులో ఉన్న అతడిని భారీ భద్రత మధ్య నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చారు. హైదరాబాద్ బాంబ్ పేలుళ్ల కేసులో కరీం తుండాపై మోపిన అభియోగాలపై వాద, ప్రతివాదనలు పూర్తయ్యాయి.
ఉగ్రవాద శిక్షణ
హైదరాబాద్ బాంబ్ పేలుళ్లే కాదు దేశవ్యాప్తంగా జరిగిన పేలుళ్ల కేసులో కూడా కరీం తుండా ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. 1990లో యువకులను ఉగ్రవాదంపై మళ్లించి కరీం తుండా శిక్షణ కూడా ఇప్పించాడు. తర్వాత పాకిస్థాన్ వెళ్లి తలదాచుకొన్నాడు. పేలుళ్ల కేసులకు సంబంధించి కరీం తుండా కోసం ఎన్ఐఏ, ఇంటర్ పోల్ ఇతర దర్యాప్తు సంస్థలు కరీం తుండా కోనం అన్వేషిస్తున్నాయి.
ఏడేళ్ల క్రితం అరెస్ట్
ఏడేళ్ల క్రితం నేపాల్ సరిహద్దులో ఢిల్లీ పోలీసులు కరీం తుండాను అరెస్ట్ చేశారు. తర్వాత మేజిస్ట్రేట్ రిమాండ్ విధించడంతో తీహార్ జైలుకు తరలించారు. హైదరాబాద్ బాంబ్ పేలుళ్లతో సంబంధం ఉండటంతో పీటీ వారెంట్పై హైదరాబాద్ సిట్ పోలీసులు తీసుకొచ్చారు. అప్పటినుంచి చంచల్గూడ జైలులో ఉంటున్నారు. తుండా బాంబుల తయారీలో సిద్ధహస్తుడు. 1993 ముంబై వరుస పేలుళ్లకు పాల్పడింది కూడా తుండానే. బాంబు తయారీ చేస్తుండగా ఆయన ఎడమ చేతికి గాయమైంది.
ఐఎస్ఐలో చేరి
1943లో ఢిల్లీ దర్యాగంజ్ చట్టా లాల్లో నిరుపేద కుటుంబంలో తుండా జన్మించాడు. యూపీ ఘజియాబాద్ జిల్లా పిఖువ బజార్ ఖుర్ద్లో వడ్రంగిగా పనిచేశాడు. ఇండియా నుంచి పాకిస్థాన్ పారిపోయాడు 1980లో ఐఎస్ఐలో చేరి జిహాదీగా మారాడు. అక్కడే ఐఎస్ఐ, లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థల్లో కూడా పనిచేశాడు. భారత్ వచ్చి యువకులను ఉగ్రవాదం వైపు మళ్లించాడు. బాంబులు తయారీ చేయడంతో తుండా దిట్ట. ఛత్తీస్గడ్ ఎక్స్ప్రెస్ బాంబ్ను పేల్చింది కూడా తుండానే.