కోర్టు వద్ద లేఖ విసిరి భత్కల్ హల్చల్: ఎవరి కోసం విసిరాడు?
హైదరాబాద్: ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాది, దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసు నిందితుడు యాసిన్ భత్కల్ సోమవారం నాడు రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద హల్ చల్ చేశాడు. భత్కల్ను ఈ రోజు కోర్టులో హాజరుపరిచారు. భత్కల్ హాజరు నేపథ్యంలో కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
80 మంది వరకు భద్రతను ఉంచారు. భత్కల్ కోర్టు హాలు నుంచి వచ్చాక ఓ లేఖను విసిరాడు. దీంతో కలకలం చెలరేగింది. పోలీసులు వెంటనే ఆ లేఖను స్వాధీనం చేసుకున్నారు.
తన ప్రాణానికి ముప్పు ఉందని, తన పైన దుష్ప్రచారం చేస్తున్నారని లేఖలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ లేఖ ఎందుకు విసిరాడు, ఎవరికి ఇచ్చేందుకు విసిరాడు, ఏదైనా తప్పించుకనే ఉపాయం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
ఆ లేఖను అతను జైలులో ఉండగానే రాశాడా లేక బస్సులో కోర్టు హాలుకు తరలిస్తుండగా రాశాడా అనే విషయం పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. పిటి వారెంటు పైన యాసిన్ భత్కల్ను పోలీసులు రాజస్థాన్ తీసుకు వెళ్లనున్నారు.