వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోర్టు వద్ద లేఖ విసిరి భత్కల్ హల్‌చల్: ఎవరి కోసం విసిరాడు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాది, దిల్‌సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసు నిందితుడు యాసిన్ భత్కల్ సోమవారం నాడు రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద హల్ చల్ చేశాడు. భత్కల్‌ను ఈ రోజు కోర్టులో హాజరుపరిచారు. భత్కల్ హాజరు నేపథ్యంలో కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Terrorist Yasin Bhatkal hulchul at Court

80 మంది వరకు భద్రతను ఉంచారు. భత్కల్ కోర్టు హాలు నుంచి వచ్చాక ఓ లేఖను విసిరాడు. దీంతో కలకలం చెలరేగింది. పోలీసులు వెంటనే ఆ లేఖను స్వాధీనం చేసుకున్నారు.

తన ప్రాణానికి ముప్పు ఉందని, తన పైన దుష్ప్రచారం చేస్తున్నారని లేఖలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ లేఖ ఎందుకు విసిరాడు, ఎవరికి ఇచ్చేందుకు విసిరాడు, ఏదైనా తప్పించుకనే ఉపాయం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

Terrorist Yasin Bhatkal hulchul at Court

ఆ లేఖను అతను జైలులో ఉండగానే రాశాడా లేక బస్సులో కోర్టు హాలుకు తరలిస్తుండగా రాశాడా అనే విషయం పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. పిటి వారెంటు పైన యాసిన్ భత్కల్‌ను పోలీసులు రాజస్థాన్ తీసుకు వెళ్లనున్నారు.

English summary
Terrorist Yasin Bhatkal hulchul at Ranga Reddy Court
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X