మేయర్కు వ్యతిరేకంగా అసమ్మతి.. అధికార పార్టీలో లుకలుకలు
మరోసారి ఖమ్మం కార్పోరేషన్లో తిరుగు బావుటా ఎగరేశారు అధికార పార్టీ కార్పోరేటర్లు, ప్రస్థుత మేయర్ పాపరావుకు వ్యతిరేకంగా వారు సమావేశమయ్యారు. పాపరావును తొలగించి, అవిశ్వాస తీర్మాణం పెట్టేందుకు గాను రహస్యంగా సమావేశమయినట్టు తెలుస్తోంది. కాగ మొత్తం 39 మంది అధికార పార్టీ కార్పోటేర్లలో 35 మంది కార్పోరేటర్లు సమావేశానికి హజరయినట్టు సమాచారం. కాగా గత కొంత కాలంగా మేయర్ పాపరావుపై మెజారీటీ కార్పోరేటర్లు అసంతృప్తిగా ఉన్నారు.
Recommended Video
నెల రోజుల తర్వాత ఖమ్మం కార్పోరేషన్లోని అధికార కూటమిలో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. గతంలో కూడ కార్పోరేషన్ మేయర్ పాపారావు తప్పుకోవాలంటూ కార్పోరేటర్లంతా జట్టు కట్టారు. అయితే విషయం రాష్ట్ర పార్టీ దృష్టికి రావడంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. దీంతో కార్పోరేటర్లకు సర్ధిచెప్పి సమస్యను తాత్కలికంగా సద్దుమణిగేలా చేశాడు.
అయితే అధిష్టానం రంగంలోకి దిగినా కార్పోరేటర్లలో అసంతృప్తి మాత్రం చల్లారలేదు. మరోసారి వారి మధ్య విబేధాలు బయటపడ్డాయి. దీంతో స్థానికంగా ఉన్న ఓ గెస్ట్ హౌజ్లో సమావేశమయ్యారు. మేయర్ పాపరావు పార్టీకి చెందిన ఇతర కార్పోరేటర్లు కలుపుకుని పోకపోవడంతోపాటు అభివృద్దిలో భాగస్వామ్యులను చేయడం లేదని కార్పోరేటర్లు పిర్యాధు చేశారు. దీంతో మేయర్ పై అవిశ్వాస తీర్మాణం చేపట్టేందుకు సమావేశమైనట్టు సమాచారం.