చనిపోయిన వ్యక్తి మళ్ళీ బతికాడు .. ఆతర్వాత ఏమైందంటే
చనిపోయిన వ్యక్తి బ్రతికి తిరిగి లేచే సంఘటనలు చాలా చాలా అరుదు. అలంటి సంఘటనలు ఎక్కడైనా జరిగితే చాలా వింతగా ఫీల్ అవుతాం . దానిపై పెద్ద ఎత్తున చర్చ పెడతాం . తాజాగా అలాంటి ఒక ప్రచారమే జ్జరిగింది. చనిపోయిన వ్యక్తి తిరిగి బ్రతికాడని ప్రచారం జరిగింది. అసలు వివరాల్లోకి వెళితే
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం పద్మనగర్కు చెందిన సిరిసిల్ల చంద్రమౌళి నేతకార్మికుడు. తానూ పని చేసే కార్ఖానాకు వెళ్లిన చంద్రమౌళి సాంచాల మరమతుకు పూనుకున్నాడు. ఈక్రమంలో విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఆస్పత్రికి తీసుకెళ్ళేలోపే మరణించాడు .ఇక వైద్యులు సైతం ఆయన చనిపోయాడని ద్రువీకరించి మార్చురీకి తరలించారు.
మృతదేహాన్ని చూసేందుకు వెళ్ళిన బంధువుల్లో ఒకరు చూసేందుకు వెళ్లి మృతదేహానికి చెమటలు వస్తున్నాయని కుటుంబసభ్యులుకు తెలిపాడు. వైద్యులు అది మృత దేహం అని చెప్పినా వినకుండా మరోమారు కరీంనగర్ తరలించారు .. అక్కడ వైద్యులు కూడా ఎప్పుడో చనిపోయాడని ధ్రువీకరించడంతో నిరాశతో వెనుదిరిగారు. దీంతో కుటుంబసభ్యులు ఆ శవంతో వెనుదిరిగారు. అయితే, చనిపోయిన వ్యక్తి మళ్లీ బతికాడంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. కానీ చనిపోయిన ఆయన బ్రతికే ఉన్నాడని భ్రమపడి వారు ఆస్పత్రికి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది.