ఖమ్మం ఆస్పత్రి డెలివరీ ఫొటో పోస్ట్పై విచారణ కమిటీ, బాధ్యులపై చర్యలు ?
ఖమ్మం : సర్కార్ దవాఖానలో మహిళ డెలివరీ సమయంలో ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనకు సంబంధించి విచారణ కమిటీని వేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు కమిటీని నియమిస్తున్నట్టు మీడియాకు తెలిపారు.
వాట్సాప్లో పోస్ట్ ..
ఇటీవల ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో ఓ మహిళకు డెలివరీ చేశారు. ఆ సమయంలో హెడ్ నర్స్ వీడియో తీసింది. వీడియో తీయడమే తప్పయితే .. ఆమె ఆ వీడియోను సోషల్ మీడియా వాట్సాప్లో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో తెగ వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు కామెంట్లు చేస్తుంటే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
ఉపేక్షించం
..
ఆస్పత్రిలో
వీడియోలు
తీసినవారిపై
చర్యలు
తీసుకుంటామని
సూపరింటెండెంట్
స్పష్టంచేశారు.
విధుల్లో
నిర్లక్ష్యం
వహిస్తే
చర్యలు
తప్పవని
హెచ్చరించారు.
దీనిపై
ఇప్పటికే
జిల్లా
కలెక్టర్,
వైద్యారోగ్య
శాఖ
ఉన్నతాధికారులకు
ఫిర్యయాదు
చేశామని
తెలిపారు.