వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణా హైకోర్టులో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై నేడు 117 పిటీషన్ల విచారణ

|
Google Oneindia TeluguNews

నేడు తెలంగాణ హైకోర్టులో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై వేసిన అన్ని పిటీషన్ల విచారణ జరగనుంది. ఒకే సారి జరుగుతున్న ఈ విచారణ చరిత్ర సృష్టించనుంది. కేసీఆర్ సర్కారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో వందల కొద్దీ ఫిర్యాదులతో ఎన్నో పిటిషన్లు హైకోర్టుకు చేరాయి. వాటన్నింటినీ ఒకేసారి విచారించాలని నిర్ణయించిన హైకోర్టు కాళేశ్వరానికి వ్యతిరేకంగా దాఖలైన 177 పిటిషన్లను నేడు విచారించనుంది.

ఒకేరోజు రెండు వెట్‌రన్లు : కాళేశ్వరం 3,4 వెట్ రన్లు సక్సెస్ ఒకేరోజు రెండు వెట్‌రన్లు : కాళేశ్వరం 3,4 వెట్ రన్లు సక్సెస్

The trial of 117 petitions on the Kaleshwaram project in Telangana High Court today

కాళేశ్వరం ముంపు పరిధిలోని కిష్టాపూర్ లో పనులు చేయరాదని గతంలో సింగిల్ జడ్జి తీర్పు వెలువడిన సంగతి తెలిసిందే. కిష్టాపూర్ తో పాటు ఇప్పుడు పలు ఇతర గ్రామాల ప్రజలు కూడా పిటిషన్ లలో భాగం అయ్యారు. కిష్టాపూర్ పై సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం అపీల్ చేయగా, దానిపైనా నేడు విచారణ జరగనుంది. అలాగే రైతులు, రైతు కూలీలు, ఇతరులకు పునరావాసం కల్పించే వరకూ ప్రాజెక్టు పనులను చేపట్టవద్దని దాఖలైన పిటిషన్లే ఇందులో అధికంగా ఉన్నాయి. మరి నేడు ధర్మాసనం ముందుకు విచారణకు వస్తున్న ఈ పిటీషన్ల విషయంలో హైకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో మరి.

English summary
The trial of all the petitions on the Kaleshwara project in Telangana High Court is to be held today. This trial is going to create history simultaneously. Many petitions have been filed with the High Court in the case of hundreds of complaints of the KALESHWARAM project, which is the most prestigious to KCR government. The 177 petitions filed against the High Court are scheduled to be heard today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X