తెలంగాణా హైకోర్టులో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై నేడు 117 పిటీషన్ల విచారణ
నేడు తెలంగాణ హైకోర్టులో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై వేసిన అన్ని పిటీషన్ల విచారణ జరగనుంది. ఒకే సారి జరుగుతున్న ఈ విచారణ చరిత్ర సృష్టించనుంది. కేసీఆర్ సర్కారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో వందల కొద్దీ ఫిర్యాదులతో ఎన్నో పిటిషన్లు హైకోర్టుకు చేరాయి. వాటన్నింటినీ ఒకేసారి విచారించాలని నిర్ణయించిన హైకోర్టు కాళేశ్వరానికి వ్యతిరేకంగా దాఖలైన 177 పిటిషన్లను నేడు విచారించనుంది.
ఒకేరోజు రెండు వెట్రన్లు : కాళేశ్వరం 3,4 వెట్ రన్లు సక్సెస్
కాళేశ్వరం ముంపు పరిధిలోని కిష్టాపూర్ లో పనులు చేయరాదని గతంలో సింగిల్ జడ్జి తీర్పు వెలువడిన సంగతి తెలిసిందే. కిష్టాపూర్ తో పాటు ఇప్పుడు పలు ఇతర గ్రామాల ప్రజలు కూడా పిటిషన్ లలో భాగం అయ్యారు. కిష్టాపూర్ పై సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం అపీల్ చేయగా, దానిపైనా నేడు విచారణ జరగనుంది. అలాగే రైతులు, రైతు కూలీలు, ఇతరులకు పునరావాసం కల్పించే వరకూ ప్రాజెక్టు పనులను చేపట్టవద్దని దాఖలైన పిటిషన్లే ఇందులో అధికంగా ఉన్నాయి. మరి నేడు ధర్మాసనం ముందుకు విచారణకు వస్తున్న ఈ పిటీషన్ల విషయంలో హైకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో మరి.