నో బర్డ్ఫ్లూ: చికెన్ తిన్న ఈటెల, గంగుల(పిక్చర్స్)
కరీంనగర్: మన దేశంలో బర్డ్ ఫ్లూ వైరస్ లేదని నిర్భయంగా కోడి గుడ్లను, కోడి మాంసాన్ని తినవచ్చని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. శనివారం నగరంలోని సర్కస్ మైదానంలో ఏర్పాటు చేసిన చికెన్ మేళాలో పాల్గొని మాట్లాడారు. వండే వంటల వల్ల వైరస్ రాదని చెప్పారు.
అసలు కోళ్ల నుంచి మనుషులకు బర్డ్ ఫ్లూ వైరస్ రాదని అన్నారు. ప్రజలకు చికెన్, గుడ్లు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని వివరించారు. పౌల్ట్రీ పరిశ్రమ అనేక వేలమందికి ఉపాధి కల్పిస్తోందని అన్నారు. తన ఇంటి భోజనంలో ప్రతి రోజు గుడ్డు లేదా చికెన్ ఆహారంలో తీసుకుంటామని తెలిపారు.
కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్, కలెక్టర్ నీతూ ప్రసాద్, జడ్పీ ఛైర్మన్ తుల ఉమ, ఎమ్మెల్యేలు గంగుల కమలాకార్, పుట్ట మధు, నగర మేయర్ రవీందర్ సింగ్, అధికారులు పాల్గొన్నారు.
నో బర్డ్ఫ్లూ
మన దేశంలో బర్డ్ ఫ్లూ వైరస్ లేదని నిర్భయంగా కోడి గుడ్లను, కోడి మాంసాన్ని తినవచ్చని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.
నో బర్డ్ఫ్లూ
శనివారం నగరంలోని సర్కస్ మైదానంలో ఏర్పాటు చేసిన చికెన్ మేళాలో పాల్గొని మాట్లాడారు. వండే వంటల వల్ల వైరస్ రాదని చెప్పారు.
నో బర్డ్ఫ్లూ
అసలు కోళ్ల నుంచి మనుషులకు బర్డ్ ఫ్లూ వైరస్ రాదని అన్నారు. ప్రజలకు చికెన్, గుడ్లు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని వివరించారు.
నో బర్డ్ఫ్లూ
పౌల్ట్రీ పరిశ్రమ అనేక వేలమందికి ఉపాధి కల్పిస్తోందని అన్నారు. తన ఇంటి భోజనంలో ప్రతి రోజు గుడ్డు లేదా చికెన్ ఆహారంలో తీసుకుంటామని తెలిపారు.