కాంగ్రెస్ కు జోష్ లేదు, బిజేపికి హోష్ లేదు..కేటిఆర్
కాంగ్రెస్ కు జోష్ లేదు, బిజేపికి హోష్ లేదన్నారు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ . అసెంబ్లి ఎన్నికల్లోలాగానే ఎంపీ ఎన్నికల్లో కూడ కాంగ్రెస్ , బిజేపిలకు మరో సారి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.ఈ ఎన్నికల్లో బిజేపి గెలిస్తే మోదీకి లాభం చేకూరుతుందని , కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ గాంధికి లాభం చేకూరుందని ..కాని టిఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ కు లాభం చేకూరుతుందన్నారు.
కేసీఆర్ మన ఆస్తులను లాక్కుంటున్నాడు..జగన్ కు ఓటేస్తే అంతే: చంద్రబాబు..!
ఈనేపథ్యంలో కాంగ్రెస్ ,బిజేపిలతో ఒరిగిందేమి లేదని స్పష్టం చేశారు. రెండు పార్టీల పాలనలో దేశం అభివృద్ది సాధిందేమి లేదని తెలిపారు. కాగా ఎన్డీయెకు 150 సీట్లు, యూపిఏకు 100 సీట్లకు మించి వచ్చే పరిస్థితి లేదని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో పదహారు ఎంపీ సీట్లు గెలిచి ఢిల్లీని శాసించాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని ,అసెంబ్లి ఎన్నికల్లో ఓడిపోయిన వారిని ఎంపీలుగా పోటిలో పెడుతున్నారని దుయ్యబట్టారు..తెలంగాణ భవన్ లో కేటిఆర్ సమక్షంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు అనిల్ జాదవ్ టిఆర్ఎస్ లో చేరారు.ఈ సంధర్భంగా కేటిఆర్ మాట్లాడారు.