నిన్ను, నీ కుటుంబాన్ని చంపేస్తాం: బిజెపి ఎమ్మెల్యేకు బెదిరింపు ఫోన్
హైదరాబాద్: నన్ను, నా కుటుంబాన్ని హతమారుస్తామని, ఏ సమయంలోనైనా చంపేస్తామని రెండు రోజులుగా తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని భారతీయ జనతా పార్టీకి చెందిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు గురువారం రాత్రి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 8న నిజామాబాద్ వెళ్తున్న సందర్భంగా తనకు ఫోన్ కాల్ వచ్చిందని చెప్పారు. నీ అంతు చూస్తామని బెదిరించారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
తనకు వచ్చిన ఫోన్ క్లాస్ నెంబర్లను నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డికి ఆయన ఇచ్చారు. తనకు బుధవారం ఉదయం 10.15 గంటలకు, ఆ తర్వాత రాత్రి తొమ్మిదిన్నరకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని చెప్పారు. తన కుటుంబీకులకు ఏమైనా జరిగితో పోలీసులదే బాధ్యత అన్నారు. గతంలో చాలాసార్లు చెప్పినా పట్టించుకోలేదన్నారు.
Comments
English summary
Threat calls to MLA Raja Singh Lodh
Story first published: Friday, July 10, 2015, 12:33 [IST]