హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జాతీయ జెండాకు అవమానం: ముగ్గురు కాశ్మీరీల అరెస్ట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సినిమా థియేటర్‌లో జాతీయగీతం వస్తున్న సమయంలో లేచి నిలబడకుండా అగౌరవపర్చిన ముగ్గురు విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి చెందిన ఒమర్‌ ఫైజల్‌, ముదాబీర్‌ షబ్బీర్‌, జమునుగల్‌లు నగరంలోని రేతిబౌలీలో ఉంటున్నారు.

ఈ ముగ్గురు చేవెళ్లలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో చదవుతున్నారు. ఆదివారం సాయంత్రం అత్తాపూర్‌లోని మంత్రామాల్‌ థియేటర్‌లో సినిమా చూడటానికి వచ్చారు. సినిమా ప్రారంభానికి ముందు జాతీయగీతం వస్తున్న సమయంలో ప్రేక్షకులంతా లేచి నిలబడగా.. ఈ ముగ్గురు స్నేహితులు కూర్చొనే ఉన్నారు.

Three arrested in Hyderabad for not standing up during national anthem

తోటి ప్రేక్షకులు వారిని ప్రశ్నించగా దురుసుగా సమాధానమివ్వడంతో థియేటర్‌ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నిర్వాహకులు రాజేంద్రనగర్‌ పోలీసులకు సమాచారం అందించారు. జాతీయగీతాన్ని అగౌరవపర్చడంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు.

English summary
Three Kashmiri youth were arrested by Hyderabad police for allegedly not standing up when the national anthem was being played at a cinema hall on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X