5వేల మంది పోలీసులు, 5వందల కెమెరాలతో: శోభాయాత్రపై ఖాకీ నిఘా..
భారీ బందోబస్తులో దాదాపు 5వేల మంది పోలీసులు శోభాయాత్రను పర్యవేక్షించారు. పర్యవేక్షణలో భాగంగా శోభాయాత్ర జరిగే మార్గం గుండా 5వందల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
హైదరాబాద్: శ్రీరామనవమిని పురస్కరించుకుని రామభక్తులంతా హైదరాబాద్లో శోభాయాత్ర నిర్వహించడం ఏళ్లుగా కొనసాగుతోంది. నేటి శ్రీరామనవమి సందర్బంగా ఈరోజు సాయంత్రం శ్రీరాముడి శోభాయాత్ర నిర్వహించనున్నారు. శోభాయాత్ర నేపథ్యంలో పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయనుంది.
భారీ బందోబస్తులో దాదాపు 5వేల మంది పోలీసులు శోభాయాత్రను పర్యవేక్షించారు. పర్యవేక్షణలో భాగంగా శోభాయాత్ర జరిగే మార్గం గుండా 5వందల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. తొలిసారిగా ముఖాన్ని గుర్తించగలిగే(ఫేస్ రికగ్నైజ్డ్) కెమెరాలను పోలీసులు శోభాయాత్రలో ఉపయోగిస్తుండటం విశేషం.
అవాంచనీయ ఘటనలు జరగవచ్చన్న అనుమానాలున్న చోట ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను పోలీసులు రంగంలోకి దించారు. శోభాయాత్ర మొత్తాన్ని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి హైదరాబాద్ నగర సీపీ మహేందర్ రెడ్డి పర్యవేక్షిస్తుంటారు. శోభయాత్ర నేపథ్యంలో మద్యం దుకాణాలను మూసివేయించారు. ట్రాఫిక్ ఆంక్షలు ఉదయం నుంచి అమలులోకి వచ్చాయి.
బోయిగూడ కమాన్ నుంచి వచ్చే వాహనాలను సీతారాంబాగ్ వైపు అనుమతించరు. అలాగే పురాన్ పూల్ ట్రాఫిక్ ను పురాన్ పూల్ బ్రిడ్జి వైపు నుంచి పేట్లబుర్జి, కల్సుంపుర, కార్వాన్ మీదుగా మళ్లిస్తారు. ధూళ్ పేట్, రామ్ మందిర్, గౌలిగూడ ట్రాఫిక్ ను ఆసిఫ్ నగర్ మీదుగా మళ్లిస్తారు.