ప్రత్యూష పేరిట ఫ్లాట్ రిజిస్ట్రేషన్: కానుకగా ఇవ్వాలని తండ్రికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్:
సవతి
తల్లి
చాముండేశ్వరి
చేతిలో
చిత్రహింసలకు
గురైన
యువతి
ప్రత్యూష
పేరిట
ఫ్లాట్
రిజిస్ట్రేషన్
చేసేందుకు
తనకు
ఎలాంటి
అభ్యంతరం
లేదని
ఆమె
తండ్రి
హైకోర్టుకు
తెలిపారు.
తన
తల్లి
పేరున
ఉన్న
ఆ
ఫ్లాట్ను
ప్రత్యూష
పేరు
మీద
రిజిస్ట్రేషన్
చేసి,
ఆమెకు
కానుకగా
అందజేయాలని
హైకోర్టు
ఆదేశించిన
నేపథ్యంలో
తండ్రి
ఈ
మేరకు
స్పందించారు.
కాగా, ఆ ప్రకటనను నమోదు చేసిన ధర్మాసనం.. రిజిస్ట్రేషన్ అయ్యేందుకు తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్జీపీ) శరత్కుమార్కు సూచించింది.
ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసలే, జస్టిస్ ఎస్వీ భట్లతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.
సోమవారం ప్రత్యూష తండ్రి కోర్టుకు హాజరయ్యారు. ఎస్జీపీ వాదనలు వినిపిస్తూ.. తండ్రి పేరుమీద ఉన్న ఫ్లాట్ను ప్రత్యూష పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు ఆ యువతి తండ్రి అంగీకరించారని.. సంక్రాంతి సెలవులలోపే ఆ ప్రక్రియ పూర్తి చేస్తానన్నారని తెలిపారు.
రిజిస్ట్రేషన్ అయ్యాక.. ఆ ఫ్లాట్ అద్దె ఆ యువతికి చెందేలా చర్యలు తీసుకోవాలని ఎస్జీపీకి హైకోర్టు సూచించింది. ఆ ఫ్లాట్లో ఆద్దెకుండే వారు ప్రత్యూషతో ఒప్పందం చేసుకునేలా చూడాలని కోర్టు పేర్కొంది.