ముందస్తు ఎన్నికలు: కేసీఆర్ ప్రకటించిన 105మంది అభ్యర్థులు వీరే
Recommended Video
హైదరాబాద్: తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల భేరీ మోగించారు. అసెంబ్లీని రద్దు చేయడమే కాకుండా తమ పార్టీ తరపున ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసే 105మంది అభ్యర్థుల జాబితాను గురువారం ఆయన విడుదల చేశారు.
సిట్టింగ్ స్థానాల్లో ఇద్దరికి మాత్రమే టికెట్ నిరాకరించిన కేసీఆర్.. మరో ఐదుగురు సిట్టింగ్ అభ్యర్థుల టికెట్ల విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతో వారికి టికెట్లు ఇస్తారా? లేదా? అనేది సందగ్ధంగా మారింది. ఆంధోల్ ఎమ్మెల్యేగా ఉన్న బాబు మోహన్కు టికెట్ ఇవ్వకుండా జర్నలిస్టు క్రాంతికి టికెట్ ఇవ్వడం గమనార్హం.
తెలంగాణ అసెంబ్లీ రద్దు.. జస్ట్ 2 నిమిషాల్లో: కేసీఆర్ సంచలన నిర్ణయం, ఇదీ విషయం!
కాగా, మేడ్చల్, మల్కాజ్గిరి, వరంగల్ ఈస్ట్, చొప్పదండి, వికారాబాద్ నియోజవకర్గాలకు ఆయా లోకల్ లీడర్లతో మాట్లాడిన తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ ఐదు నియోజకవర్గాలకు మినహాయించి.. మిగిలిన సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తున్నామని తెలిపారు. అనేక సర్వేల తర్వాత టికెట్లు ఇచ్చామని కేసీఆర్ వివరించారు.