సోషల్ మీడియాలో నాది, నా కూతురు ఫోటో పెట్టి ప్రచారం: కెకె
శంషాబాద్ ప్రాంతంలో తనకు సెంటు భూమి కూడా లేదని టీఆర్ఎస్ ఎంపీ కె కేశవరావు ఆదివారం స్పష్టం చేశారు. తాను, తన కుమార్తె కలిసి శంషాబాద్లో దిగిన ఫోటో చూపించి, భూమి కొన్నట్లుగా ఆరోపించడం విడ్డూరమన్నారు.
హైదరాబాద్: శంషాబాద్ ప్రాంతంలో తనకు సెంటు భూమి కూడా లేదని టీఆర్ఎస్ ఎంపీ కె కేశవరావు ఆదివారం స్పష్టం చేశారు. తాను, తన కుమార్తె కలిసి శంషాబాద్లో దిగిన ఫోటో చూపించి, భూమి కొన్నట్లుగా ఆరోపించడం విడ్డూరమన్నారు.
దండుమైలారం గ్రామంలో మాత్రం భూములు కొనుగోలు చేసిన మాట వాస్తవమేనని తెలిపారు. శంషాబాద్ ప్రాంతంలో తనతో పాటు తన కుమార్తె ఫోటో పెట్టి కొందరు మీడియాలో వార్తలు రాశారన్నారు. కొందరు కావాలనే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు.
దండుమైలారంలో భూముల కొనుగోలు ఒప్పదం 2013లో జరిగిందని, అప్పుడు తాను కాంగ్రెస్ ఎంపీగా ఉన్నానని చెప్పారు. కోర్టు ఉత్తర్వుల ఆధారంగా అన్ని పత్రాలను పరిశీలించిన తర్వాతనే తాము దండుమైలారంలో భూములు కొన్నామన్నారు.
Comments
cyberabad police miyapur land scam hyderabad srinivasa rao pvs sharma ps parthasarathi kk k keshava rao సైబరాబాద్ పోలీసు మియాపూర్ భూకుంభకోణం హైదరాబాద్ శ్రీనివాస రావు పార్థసారథి
English summary
Senior Rajya Sabha member and TRS Parliamentary Party member K Keshava Rao has denied allegations that he and his family members had allegedly purchased land illegally in Ibrahimpatnam on the outskirts of Hyderabad. The land was allegedly purchased through one of the two real estate firms that have been accused of grabbing government land in Miyapur area of Hyderabad.
Story first published: Sunday, June 11, 2017, 17:15 [IST]