హైదరాబాద్లో టీఆర్ఎస్ నేత వల్లభనేని దారుణ హత్య
హైదరాబాద్: నగరంలో దారుణ ఘటున చోటు చేసుకుంది. టీఆర్ఎస్ నాయకుడు, విద్యావేత్త వల్లభనేని శ్రీనివాసరావును కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
శ్రీనివాసరావు తలపై బండరాళ్లతో మోది హత్య చేశారు నిందితులు. సనత్నగర్ బస్టాండ్లో ఈ ఘటన జరిగింది. గురువారం తెల్లవారుజామున మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సనత్నగర్ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని, శ్రీనివాసరావు హత్య ఎవరు చేశారన్నదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. శ్రీనివాసరావు మృతితో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Comments
English summary
TRS leader Vallabhaneni Srinivasa Rao was found dead at Lingaiah Nagar near Sanathnagar bus stand in the early hours of Thursday. He was stoned to death by unidentified persons