కేసీఆర్కు సొంత జిల్లాలో రివర్స్: టీడీపీలోకి(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకు వస్తామని, టీడీపీని ఏ శక్తి అడ్డుకోలేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం అన్నారు. మెదక్ జిల్లా దుబ్బాక ప్రాంతానికి చెందిన తెరాస నేతలు, కార్యకర్తలు పలువురు టీడీపీలో చేరారు.
వారిని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. టీడీపీ నుండి ఒక్క నాయకుడు వెళ్తే వందమందిని తయారు చేస్తామని చెప్పారు. తెలంగాణ టీడీపీ పటిష్టానికి ఇథర జిల్లాల్లోను పర్యటిస్తానని చెప్పారు. తెరాస అధ్యక్షుడు తెలంగాణలో టీడీపీ లేకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నారని, కార్యకర్తలే టీడీపీకి బలమన్నారు.
కేసీఆర్కు అనేక పదవులు ఇచ్చానని, ఆ రోజు టీడీపీ లేకపోతే ఆయనకు రాజకీయ ఉనికి ఎక్కడిదని ప్రశ్నించారు. తెరాస ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టారు. వచ్చే ఎన్నిక్లలో గెలుపే ధ్యేయంగా టీడీపీ కార్యకర్తలు కలిసి పని చేయాలన్నారు. పార్టీలో చేరిన వారిని కండువా కప్పి బాబు ఆహ్వానించారు.
చంద్రబాబు
మెదక్ జిల్లా దుబ్బాకకు చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.
చంద్రబాబు
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. తెలంగాణలో తెలుగుదేశం గెలుపును ఏ శక్తీ అడ్డుకోలేదని ధీమా వ్యక్తం చేశారు.
చంద్రబాబు
2019లో టీడీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ లేకపోతే కేసీఆర్కు రాజకీయంగా ఉనికే లేదన్నారు. త్వరలో తెలంగాణలోని మిగతా జిల్లాల్లో పర్యటిస్తానని చంద్రబాబు ప్రకటించారు.
చంద్రబాబు
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకు వస్తామని, టీడీపీని ఏ శక్తి అడ్డుకోలేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం అన్నారు.
చంద్రబాబు
మెదక్ జిల్లా దుబ్బాక ప్రాంతానికి చెందిన తెరాస నేతలు, కార్యకర్తలు పలువురు టీడీపీలో చేరారు. వారిని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. టీడీపీ నుండి ఒక్క నాయకుడు వెళ్తే వందమందిని తయారు చేస్తామని చెప్పారు.
చంద్రబాబు
తెలంగాణ టీడీపీ పటిష్టానికి ఇథర జిల్లాల్లోను పర్యటిస్తానని చెప్పారు. తెరాస అధ్యక్షుడు తెలంగాణలో టీడీపీ లేకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నారని, కార్యకర్తలే టీడీపీకి బలమన్నారు.
చంద్రబాబు
కేసీఆర్కు అనేక పదవులు ఇచ్చానని, ఆ రోజు టీడీపీ లేకపోతే ఆయనకు రాజకీయ ఉనికి ఎక్కడిదని ప్రశ్నించారు. తెరాస ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టారు.
చంద్రబాబు
వచ్చే ఎన్నిక్లలో గెలుపే ధ్యేయంగా టీడీపీ కార్యకర్తలు కలిసి పని చేయాలన్నారు. పార్టీలో చేరిన వారిని కండువా కప్పి బాబు ఆహ్వానించారు.