టీఆర్ఎస్ ఎమ్మెల్యే డ్రైవర్,గన్మెన్కు కరోనా పాజిటివ్....
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ కారు డ్రైవర్తో పాటు ఆయన గన్మెన్కు కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. గత ఆదివారం(జూన్ 14) బాజిరెడ్డికి కరోనా సోకగా.. గురువారం ఆయన సతీమణికి పాజిటివ్గా నిర్దారణ అయింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ ఫోటో జర్నలిస్టుతో పాటు హైదరాబాద్లో ఉంటున్న ఆయన సతీమణి, కుమార్తెకు కూడా పాజిటివ్గా తేలింది.
ప్రస్తుతం బాజిరెడ్డి హైదరాబాద్లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో మొదట జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు కూడా పాజిటివ్గా తేలింది. ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలను గతంలో కలవడంతో అనుమానం వచ్చి పరీక్షలు చేయించుకోగా గణేష్ గుప్తాకు పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్లోని తన స్వగృహంలోనే ఆయన చికిత్స పొందుతున్నారు.
Recommended Video
ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి మొదట కరోనా సోకగా.. ఆయన సతీమణి పద్మలతా రెడ్డి,గన్మెన్,డ్రైవర్,వంట మనిషికి కూడా కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. మరోవైపు రాష్ట్రంలో అంతకంతకూ పెరుగుతున్న కేసులు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. శుక్రవారం(జూన్ 19) ఒక్క రోజే 499 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ముగ్గురు మృతి చెందారు.తాజా కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 6,525కి చేరింది. కరోనాతో ఇప్పటివరకూ మొత్తం 198 మంది మృత్యువాత పడ్డారు. శుక్రవారం నమోదైన కేసుల్లోనూ అత్యధికంగా 329 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. తాజా కేసులతో జీహెచ్ఎంసీలో కేసుల సంఖ్య 4526కి చేరింది. దీంతో గ్రేటర్ వాసుల్లో కరోనా టెన్షన్ నెలకొంది.