వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్, చంద్రబాబుల వల్లే, ప్రధానులు వారే కాబట్టి వివక్ష: ఎంపీ కవిత

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర రావుల కారణంగా తెలుగువాణిని అందరు గుర్తిస్తున్నారని తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర రావుల కారణంగా తెలుగువాణిని అందరు గుర్తిస్తున్నారని తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.

రెండు పార్టీల వ్యవస్థ ఆలోచనలకు స్వస్తి పలికి ప్రాంతీయ పార్టీలు బలోపేతం కావాలని కవిత అన్నారు. ఆ దిశగా ముందుకు వెళ్లాలని చెప్పారు. అలాగే, బీజేపీ మాజీ ఎంపీ తరుణ్ విజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు.

<strong>చంద్రబాబు మాట: మోత్కుపల్లికి గవర్నర్ పోస్ట్, అమిత్ షా హామీ?</strong>చంద్రబాబు మాట: మోత్కుపల్లికి గవర్నర్ పోస్ట్, అమిత్ షా హామీ?

మాకే జాత్యాహంకారం ఉంటే దక్షిణ భారత దేశంలోని నల్లవారితో ఎలా కలిసి ఉంటామని, శ్రీకృష్ణుడు కూడా నల్లనివాడే అని తరుణ్ విజయ్ అన్నారు. ఆయన వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు.

TRS MP kavitha praises AP CM Chandrababu Naidu

ఉత్తరాదిన ఎంపీల సంఖ్య ఎక్కువ అని, జనాభా ఎక్కువ అని, కాబట్టి ప్రధానమంత్రులు అక్కడి నుంచి ఎన్నికవుతున్నారని, కాబట్టే ఈ వివక్ష అని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రాంతీయ పార్టీలు వచ్చాకే ప్రాంతీయ సమస్యలకు గుర్తింపు వచ్చిందన్నారు. ప్రజలు దీనిని గుర్తించి ప్రాంతీయ పార్టీలను బలోపేతం చేయాలన్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల సీఎంలు తెలుగు వాణిని బలంగా వినిపిస్తున్నారన్నారు.

English summary
TRS MP Kalvakuntla Kavitha has praised Andhra Pradesh Chief Minister Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X