ఎదుర్కోలేక నన్ను, నా భర్తను అంటావా: మధుయాష్కీకి కవిత లీగల్ నోటీసులు
నిజామాబాద్/వరంగల్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ పైన తెరాస నాయకురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సోమవారం మండిపడ్డారు. ఆయనకు ప్రజల్లో ఆదరణ లేక, తనను, తెరాసను ఎదుర్కోలేక పిచ్చిప్రేలాపనలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
తన మీద, రాజకీయాలలో లేని, రాజకీయాలకు సంబంధం లేని తన భర్త మీద ఆధారాలులేని, అవాస్తవ, అర్థం పర్థం లేని ప్రచారం చేస్తున్నారని, ఇది విచారకరమని చెప్పారు. మధుయాష్కీ చేసిన ఆరోపణలు తన వ్యక్తిగత ప్రతిష్టను, రాజకీయపరపతిని దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పారు. కాబట్టి లాయర్ ద్వారా ఆయనకు లీగల్ నోటీసులు పంపిస్తున్నట్లు తెలిపారు.
మధుయాష్కీ తన పట్ల, తన భర్త పట్ల వాడిన పదజాలాన్ని వెనక్కి తీసుకోవాలని, అలాగే క్షమాపణలు కోరాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
Comments
madhu yashki kavitha ktr andhra pradesh nandamuri suhasini hyderabad praja front telangana congress mahakutami trs bjp telangana elections 2018 telangana assembly elections 2018 five state assembly elections 2018 అసెంబ్లీ ఎన్నికలు 2018
English summary
Nizamabad MP and TRS leader Kalvakuntla Kavitha sent legal notices to Congress leader Madhu Yashki.
Story first published: Monday, December 3, 2018, 20:49 [IST]