వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొడంగల్: ఆ రెండు పార్టీల నేతలపై టిఆర్ఎస్ వల, రేవంత్‌కు చిక్కులేనా?

రేవంత్‌రెడ్డిని రాజకీయంగా దెబ్బకొట్టేందుకు టిఆర్ఎస్ వ్యూహలు రచిస్తోంది. అదే సమయంలో రేవంత్‌రెడ్డి కూడ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లను కలుస్తున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

కొడంగల్: రేవంత్‌రెడ్డిని రాజకీయంగా దెబ్బకొట్టేందుకు టిఆర్ఎస్ వ్యూహలు రచిస్తోంది. అదే సమయంలో రేవంత్‌రెడ్డి కూడ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లను కలుస్తున్నారు. అయితే కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో రేవంత్ అనుచరులపై ప్రత్యేకంగా కేంద్రీకరించిన టిఆర్ఎస్ తమ పార్టీలోకి ఆహ్వనించింది. మరో వైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన నియోజకవర్గ నేతలతో రేవంత్‌రెడ్డి సమావేశం కానున్నారు.

తెలంగాణ రాజకీయాలు: అమిత్‌షా వ్యూహనికి రేవంత్‌రెడ్డి దెబ్బతెలంగాణ రాజకీయాలు: అమిత్‌షా వ్యూహనికి రేవంత్‌రెడ్డి దెబ్బ

కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపి ద్వితీయ శ్రేణి నాయకులపై టిఆర్ఎస్ కేంద్రీకరించింది. రేవంత్‌రెడ్డి వెంట నడిచిన నేతలను టిఆర్ఎస్ తమ వైపుకు లాక్కొంది. మరో వైపు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసంతృప్త నేతలపై కూడ టిఆర్ఎస్ కేంద్రీకరించింది.

రేవంత్‌ది మైండ్‌గేమ్: ''ప్రజా బ్యాలెట్ నిర్వహించండి, నవంబర్ 2న, జనరల్‌బాడీ''రేవంత్‌ది మైండ్‌గేమ్: ''ప్రజా బ్యాలెట్ నిర్వహించండి, నవంబర్ 2న, జనరల్‌బాడీ''

ఉపఎన్నికలు జరిగితే ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో రేవంత్‌ను దెబ్బకొట్టాలని టిఆర్ఎస్ వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది.టిడిపికి రాజీనామా చేసి రేవంత్‌ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో రేవంత్‌రెడ్డి అనుచరులను టిఆర్ఎస్ కేంద్రీకరించింది.

ఢిల్లీకి రేవంత్‌: 2019లో పోటీ చేసే వారంతా అక్కడే, టిక్కెట్లకోసం రాహుల్‌ హమీ?ఢిల్లీకి రేవంత్‌: 2019లో పోటీ చేసే వారంతా అక్కడే, టిక్కెట్లకోసం రాహుల్‌ హమీ?

 కాంగ్రెస్ నేతలతో రేవంత్ సమావేశం

కాంగ్రెస్ నేతలతో రేవంత్ సమావేశం

కాంగ్రెస్ పార్టీకి చెందిన కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నేతలతో రేవంత్‌రెడ్డి సమావేశం కానున్నారు. ఇప్పటివరకు టిడిపిలో ఉన్నంత కాలం రేవంత్‌ వెంట ముఖ్య నాయకులు కొందరు కాంగ్రెస్‌పార్టీలో చేరలేదు. టిఆర్ఎస్‌లో చేరారు. ఈ నియోజకవర్గంపై అధికారపార్టీకి చెందిన మంత్రులు, ముఖ్య నేతలు కేంద్రీకరించి పనిచేస్తున్నారు.కొడంగల్ నియోజకవర్గంలో కీలకమైన గ్రామానికి చెందిన నాయకుడిని టిఆర్ఎస్‌లో చేర్చుకొనేలా టిఆర్ఎస్ వ్యూహరచన చేసింది.

 కాంగ్రెస్‌ పార్టీకి సలీం రాజీనామా

కాంగ్రెస్‌ పార్టీకి సలీం రాజీనామా

కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కాంగ్రెస్‌పై కూడ టిఆర్ఎస్ దృష్టి సారించింది. నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి అత్యంత కీలక నేతగా వ్యవహరించిన జిల్లా అధికార ప్రతినిధి సలీం పార్టీకి రాజీనామా చేసి గులాబీ కండువా కప్పుకున్నారు. తనతో పాటు ముఖ్యమైన నేతలను కూడా కారెక్కించేశారు. ఈ తరుణంలోనే రేవంత్‌రెడ్డి కోస్గిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.

 టిడిపి నేతలంతా టిఆర్ఎస్‌లో

టిడిపి నేతలంతా టిఆర్ఎస్‌లో

నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో టీడీపీకి చెందిన ముఖ్యమైన వారందరూ టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు.రేవంత్‌ వెంట నడిచిన కొందరు ముఖ్యులపై టిఆర్ఎస్ కేంద్రీకరించి మరీ టిఆర్ఎస్‌ పార్టీలో చేరేలా వ్యూహన్ని రచించింది. టిఆర్ఎస్ వ్యూహం ప్రకారంగా టిఆర్ఎస్‌లో కొడంగల్ నియోజకవర్గానికి చెందిన కొందరు కీలకనేతలు టిడిపిని వీడి టిఆర్ఎస్‌లో చేరారు. ఉప ఎన్నికలైనా, 2019 ఎన్నికలైనా ఈ నియోజకవర్గం నుండి రేవంత్‌రెడ్డిని ఓడించాలనే వ్యూహంతో టిఆర్ఎస్ నాయకత్వం పనిచేస్తోంది.

 కొడంగల్‌పైనే టిఆర్ఎస్ దృష్టి

కొడంగల్‌పైనే టిఆర్ఎస్ దృష్టి

టిఆర్ఎస్ నాయకత్వం ప్రస్తుతం కొడంగల్ నియోజకవర్గంపైనే దృష్టి కేంద్రీకరించింది.టిడిపి ద్వితీయశ్రేణినాయకులను పార్టీలో చేర్చుకొన్న మీదట ప్రస్తుతం కాంగ్రెస్ నేతలపై టిఆర్ఎస్ కేంద్రీకరించింది. ఈ రెండు పార్టీలకు చెందిన కీలక నేతలను టిఆర్ఎస్‌ వైపు మళ్ళించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

English summary
TRS is planning a long-term strategy to defeat TDP MLA Revanth Reddy in his Kodangal Assembly constituency in the next general elections. It is learnt that TRS has decided to invite all constituency-level political leaders including Congress and TDP into its fold. In order to woo them, the Ministers representing Mahbubnagar district are extending olive leaf to complete their works.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X