TRS Vs BJP... కాంగ్రెస్ Vs కాంగ్రెస్.. హోరాహోరీ.. ఢీ అంటే ఢీ
తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతాపార్టీలు ఒకవైపు మదగజాల్లా తలపడుతుంటే మరోవైపు అధికారానికి కూతవేటు దూరంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం తనలో తానే భీకరయుద్ధం చేస్తోంది. తనలోని శత్రువులతో, తన ప్రత్యర్థులతో యుద్ధం చేస్తూ అసలైన ప్రత్యర్థులను మరిచిపోతోంది. దశాబ్దాల తరబడి వస్తోన్న తన పాత వాసనలను పోగొట్టుకోలేక సతమతమవుతోంది.
చేజేతులా పార్టీని దిగజారుస్తున్న నేతలు?
ఒకవైపు
టీఆర్ఎస్
నువ్వా?
నేనా?
అన్నట్లుగా
బీజేపీతో
తలపడుతోంది.
వాస్తవానికి
కాంగ్రెస్
తో
తలపడాల్సిన
టీఆర్ఎస్
వ్యూహం
మార్చి
బీజేపీతో
తలపడుతోంది.
దీంతో
టీఆర్ఎస్
తర్వాత
ఈసారి
ఎలాగైనా
అధికారం
చేజిక్కించుకునే
అవకాశం
ఉందన్న
రాజకీయ
విశ్లేషకుల
మాటలను
పక్కకు
తోసిరాజని
కాంగ్రెస్
పార్టీ
నేతలు
తమ
మాటలు,
చేష్టలతో
చేజేతులా
అధికారాన్ని
వదులుకునే
అవకాశాలున్నాయనే
వాదన
వినిపిస్తోంది.
కాంగ్రెస్ ను ఎవరూ బాగుచేయలేరేమో?
జాతీయ
కార్యవర్గ
సమావేశాలు
హైదరాబాద్లోనే
నిర్వహిస్తూ,
ఎలాగైనా
ఈసారి
అధికారాన్ని
చేజిక్కించుకుంటామంటూ
మోడీ
నుంచి
వార్డు
సభ్యుల
వరకు
అందరూ
ప్రకటనలు
చేస్తుంటే..
రేపు
నేను
సంచలన
ప్రకటన
చేస్తా..
మొత్తం
బయటకు
లాగుతా..
అంటూ
తమ
పార్టీ
అధ్యక్షుడిమీద
కాంగ్రెస్
నేతలు
ప్రకటనలు
చేస్తున్నారు.
ఇటువంటి
పరిస్థితి
నుంచి
ఆ
పార్టీ
ఎప్పటికీ
బయటపడలేదని
ప్రజలంతా
జాలిపడుతున్నారు.
ఇంతకుమించి
చేయగలిగింది
కూడా
ఏమీ
లేదు.
రేవంత్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి రభస
యశ్వంత్
సిన్హాకు
స్వాగతం
పలకడానికి
వీహెచ్
హనుమంతరావు
విమానాశ్రయానికి
వెళ్లారు.
తమ
ప్రధాన
ప్రత్యర్థిగా
ఉన్న
టీఆర్ఎస్
ఆయన్ను
హైదదాబాద్
పిలిపించి
సమావేశం
ఏర్పాటు
చేసుకుంది.
వీహెచ్
వెళ్లినప్పుడు
మిగతావారు
ఎందుకు
వెళ్లలేదంటూ
జగ్గారెడ్డి
నానా
రభస
చేశారు.
రేవంత్రెడ్డి
చేసిన
వ్యాఖ్యలపై
మండిపడ్డారు.
రాహుల్
గాంధీకి
ఇచ్చిన
మాట
తప్పి
రేపు
సంచలన
ప్రకటన
చేయనున్నట్లు
వెల్లడించారు.
ఇవన్నీ
చూస్తున్న
కాంగ్రెస్
పార్టీ
కార్యకర్తలు,
అభిమానులు
తమ
పార్టీని
రేవంత్రెడ్డి
కాదుకదా..
ఎవరు
వచ్చినా
బాగుచేయలేరేమో
అన్న
నిర్వేదంలోకి
వెళ్లిపోయారు.