తెలంగాణలో కొలువుల జాతర.. పంజాయతీరాజ్శాఖలో పోస్టులు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోలకు గుడ్ న్యూస్. పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగాలు నియమిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. పంచాయతీరాజ్ శాఖలో వివిధ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పింది. దీంతో ఎన్నాళ్ల నుంచో ఉద్యోగాల కోసం చూస్తున్న నిరుద్యోగ యువతకు ఊరట కలిగినట్లైంది. ఈ పోస్టులన్నీ గెజిటెడ్ హోదావి కాగా.. గ్రూపు-1 ర్యాంకు స్థాయి అధికారుల భర్తీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్నది.
పంచాయతీరాజ్ శాఖలో వివిధ విభాగాల్లో పోస్టులు మంజూరు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఉత్తర్వులు జారీచేశారు. దాదాపు 311 పోస్టులకు సంబంధించి ఇప్పటికే ఆర్థికశాఖ క్లియరెన్స్ ఇవ్వడంతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ త్వరలో చేపడుతామని వివరించింది.
చీఫ్ ఎగ్జిక్యూటివ్ 23, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ పోస్టు 23, జిల్లా పంచాయతీ అధికారి 23, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు 101, మండల పంచాయతీ అధికారులు 101 పోస్టులను భర్తీ చేస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ కొలువులను టీఎస్ పీఎస్సీ లేదంటే పంచాయతీరాజ్ శాఖ భర్తీ చేస్తుందనే అంశంపై మాత్రం రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. దాదాపు ఈ పోస్టులన్నీ గెజిటెడ్ హోదావి కావడం విశేషం. గ్రూపు-1 ర్యాంకు స్థాయి అధికారుల భర్తీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్నది.