హరీశ్ రావుకు చేదు అనుభవం.. మంత్రిని తాకిన ఆర్టీసీ సెగ..!
సంగారెడ్డి : తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఆదివారం నాటితో 30వ రోజుకు చేరింది. ఆ క్రమంలో ప్రభుత్వం మెట్టు దిగి రాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ఎక్కడికక్కడ ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పడుతున్నారు. కొన్ని చోట్ల ఆత్మహత్యలు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి.
దాదాపు నెల రోజుల నుంచి సమ్మె జరుగుతున్నా.. సీఎం కేసీఆర్ మొండి వైఖరి అవలంభించడం సరికాదని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు మండిపడుతున్నారు. ఆ క్రమంలో మంత్రులెవరూ ఆర్టీసీ కార్మికుల గురించి మాట్లాడకపోవడం కూడా వారికి మరింత ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్ రావుకు చేదు అనుభవం ఎదురైంది.
వివాహితకు లైంగిక వేధింపులు.. సొంత మరిది టార్చర్.. భరించలేక చివరకు..!
స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ హరీశ్ రావుకు ఆర్టీసీ సమ్మె సెగ తగిలింది. హైదరాబాద్ శివారులోని బీరంగూడలో జరిగిన బైక్ ర్యాలీలో పాల్గొనడానికి అక్కడకు వెళ్లారు హరీశ్ రావు. ఆ సమయంలో ఆయన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఆర్టీసీ కార్మికులు. దాంతో కొద్దిసేపు అక్కడ టెన్షన్ వాతావరణం కనిపించింది. మంత్రిని అడ్డుకుంటున్నారనే నెపంతో కొందరు కార్మికులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరోవైపు బీహెచ్ఈఎల్ డిపో దగ్గర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.