తెలంగాణ బంద్: ప్రైవేట్ డ్రైవర్పై దాడి.. హైదరాబాద్ బండ్లగూడలో ఉద్రిక్తత
తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యాన్ని పురస్కరించుకొని బంద్కు మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. తెలంగాన ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆర్టీసీ జేఏసీ, పలు రాజకీయ పార్టీలు శనివారం (అక్టోబర్ 19న) బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బంద్ నేపథ్యంలో ప్రభుత్వం ప్రైవేట్ డ్రైవర్లను రంగంలోకి దించి ఆర్టీసీ బస్సులను నడుపుతున్నది. అయితే బంద్ నేపథ్యంలో బస్సులను నడుపుతున్న ప్రైవేట్ డ్రైవర్లు చేదు అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వస్తున్నది.
తాజాగా హైదరాబాద్ బండ్లగూడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులను కాదని ఆర్టీసీ బస్సును నడుపుతున్న ఓ వ్యక్తిపై కొందరు మూకుమ్మడిగా దాడి చేశారు. ప్రైవేట్ డ్రైవర్ను వెంటాడి కొట్టడం మీడియాలో స్పష్టంగా కనిపించింది. బండ్లగూడ డిపో నుంచి బస్సును బయటకు తీయడానికి ప్రయత్నించగా ఈ సంఘటన చోటుచేసుకొన్నది. ఈ దాడిలో కొందరు బీజేపీ జెండాలను పట్టుకొని దాడి దిగడం స్పష్టమైంది.
కాగా ప్రైవేట్ డ్రైవర్పై దాడి చేస్తున్న సమయంలో హుటాహుటిన పోలీసుల రంగ ప్రవేశం చేశారు. ప్రైవేట్ డ్రైవర్ను దాడి నుంచి కాపాడి.. ఆర్టీసీ కార్మికులను వెంటనే అరెస్ట్ చేశారు. వారితో పాటు పలువురు ఆందోళన కారులను కూడా అదుపులోకి తీసుకొన్నారు. పలు ప్రాంతాల్లో ఆర్టీసీ కార్మికులు, జేఏపీ నేతలు, పలు పార్టీల కార్యకర్తలు వాహనాలపై దాడికి దిగడం స్పష్టంగా కనిపిస్తున్నది.
రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆర్టీసీ కార్మికులు, జేేేఏసీ నేతలు సమ్మెను విజయవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా జిల్లాల వారీగా ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరింపజేసి బంద్ను విఫలయత్నం చేసేందుకు ప్లాన్ చేస్తున్నది. ఈ క్రమంలో పోలీసులకు, కార్మికులకు, నేతలకు మధ్య భారీగా తోపులాట జరుగుతున్నది. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులకు బంద్ దారి తీస్తున్నది.
ఇదిలా ఉండగా, ఆర్టీసీ సమ్మెను పరిష్కరించాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. ఈ నేపథ్యంలో సమ్మెపై ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకొంటుందనే విషయం ఆసక్తిగా మారింది. రానున్న రోజుల్లో ఈ సమ్మె ఎలాంటి ఫలితాన్ని అందించనున్నదనేది చర్చనీయాంశమైంది.