వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తల్లిసహాకారంతో పిల్లలపై అత్యాచారం చేస్తోన్న నిందితులు
రంగారెడ్డి :ముక్కుపచ్చలారని పసిపిల్లలు. వారిని మృగాళ్ళు దారుణంగా అత్యాచారం చేస్తున్నారు. ఈ నిందితులకు స్యయంగా తల్లే సహాకరించడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు.
రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి లో ని లక్ష్మీగూడలో ఈ దారుణం చోటు చేసుకొంది. ఈ ఘటన చాల ఆలస్యంగా వెలుగుచూసింది.లక్ష్మీగూడలోని కవల పిల్లలు నాలుగో తరగతి చదువుతున్నారు.
కొంతకాలంగా ఈ కవలలపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి పూట అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఈ నిందితులకు స్వయంగా తల్లే సహాకరిస్తోందని భాదితులు చెప్పారు.
ప్రతిరోజు తమపై అత్యాచారం జరుగుతున్నట్టు స్కూల్లో ఉపాధ్యాయులకు పిల్లలు చెప్పారు. వెంటనే ఉపాధ్యాయుడు ఆ పిల్లలను బాలల సంరక్షణ అధికారులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.
Comments
telangana harassment sex rape mother teacher తల్లి అత్యాచారం వేదింపులు టీచర్ నిందితులు తెలంగాణ రంగారెడ్డి
English summary
twins raped by unknown persons with help of mother. This incident was happened in rangareddy district milardevpally village.fourth class studying twins raped by unknown persons with help of her mother.students tell her teacher. along with help of child protection officers teacher complient to police.
Story first published: Thursday, November 3, 2016, 18:57 [IST]