మమ్మల్ని విడదీస్తే బతకలేం: సహజీనం చేస్తున్న ఇద్దరు యువతులు
నల్గొండ: ‘మా బతుకు మేం బతుకుతాం. మమ్ములను విడదీయకండి. విడదీస్తే బతకలేం' అంటున్నారు సహజీవనం చేస్తున్న ఇద్దరు యువతులు. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ప్రకాష్నగర్కు చెందిన అవుట శ్రీదేవి (23), వేములపల్లి మండలం శెట్టిపాలెం పరిధిలోని రావువారిగూడేనికి చెందిన అన్నామణి(19)వదినా మరదళ్లు.
వీరు ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. సృష్టికి విరుద్ధమైన జీవనం వద్దని ఇద్దరి తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినలేదు. రెండేళ్ల కిందట ఇంటి నుంచి పారిపోయి వివాహం చేసుకున్నారు.
తాము పలుమార్లు ఇంటి నుంచి పరారయ్యామని, పెళ్లి చేసుకున్నామని, ఒకరిని విడిచి ఒకరం జీవించలేమని స్పష్టం చేశారు. గతంలో అన్నామణి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కోదాడ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.
కొద్ది కాలం వేరుగా ఉన్న శ్రీదేవికి పెళ్లి చేసినా విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తోంది. శుక్రవారం శెట్టిపాలెంలో ఉంటున్న తన సహచరి అన్నామణి కోసం వచ్చింది. శ్రీదేవి తమ కుమార్తెను సహ జీవనానికి ప్రోత్సహిస్తోందంటూ అన్నామణి తల్లి వేములపల్లి పోలీసులను ఆశ్రయించారు.