రెండు ఏటీఎంలలో చోరీ: 13లక్షల అపహరణ
హైదరాబాద్: నగరంలోని చందానగర్ ఏరియాలోని ఏటీఎమ్లలో జరిగిన చోరి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐసీఐసీఐకి చెందిన రెండు ఏటీఎమ్లలో ఈ దొంగతనం జరిగింది.
గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చోరి అయిన సంగతి గుర్తించిన ఏటీఎమ్ సిబ్బంది.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో.. వారు పోలీసులకు సమాచారం అందించారు.
గుర్తు తెలియని ముగ్గురు దుండగులు ముసుగు వేసుకుని వచ్చి.. గ్యాస్ కట్టర్తో ఏటీఎమ్లను కాల్చి దాదాపు రూ. 13లక్షల వరకు దోపిడి చేశారు. పోలీసులు సీసీటీవి పుటేజీ ఆధారంగా వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
Comments
English summary
Thieves broke into two ICICI ATM centres at Chandanagar and made away with Rs 13 lakh. Police are yet to verify when the theft took place, but the incident came to light on when customers reached the ATMs to withdraw cash.
Story first published: Friday, August 10, 2018, 23:29 [IST]