వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు అక్కడికక్కడే మృతి!

|
Google Oneindia TeluguNews

సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కోమరబండలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌ నుంచి రావులపాలెం వెళ్తున్న ఓ కారు.. కోమరబండ వద్ద ఆగి వున్న లారీని వెనుక నుంచి అతివేగంతో ఢీకొట్టింది.

ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాద సమాచారంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులను సత్యనారాయణ(35), మైత్రి(21)గా గుర్తించారు.

two killed in lorry car crash in suryapeta

ఇటీవల సత్యనారాయణ తల్లి చనిపోవడంతో శాస్త్ర ప్రకారం నిర్వహించాల్సిన కొన్ని కార్యక్రమాల కోసం ఆ కుటుంబం రావులపాలెం బయలుదేరినట్టు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

English summary
Two persons were died in a road accident at Komarabanda, Suryapeta. Accident took place on Monday morning
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X