హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అతి వేగం... ఏడుగురి ప్రాణాలు బలిగొంది (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మహాబూబ్‌నగర్ జాతీయ రహదారి కొమిరెడ్డిపల్లి వద్ద మంగళవారం ఉదయం 6.30 గంటల సమయంలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం... మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నాయిన్‌గామ్‌కు చెందిన 8 మంది ఎంహెచ్ 22వి 4866 నెంబర్ టవేరా వాహనంలో శుక్రవారం రాత్రి బయలుదేరి శ్రీశైలం, మహానంది, తిరుపతిలో దర్శనం చేసుకుని సోమవారం రాత్రి తిరుపతి నుంచి తిరుగు పయనమయ్యారు.

ఉదయం జాతీయ రహదారిపై కొమిరెడ్డిపల్లి దగ్గర అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి అవతలవైపునకు దూసుకువెళ్లడంతో పాటు హైదరాబాద్ నుంచి కేరళ వెళ్తున్న ఇన్నోవా వాహనాన్ని ఢీకొట్టి బొల్తా పడింది. ఈ ప్రమాదంలో టవేరాలో ప్రయాణిస్తున్న మహారాష్ట్రకు చెందిన ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

మృతులను శ్రీనివాస్ బాబురావు (45), వెంకట్ సాంబాజీ (42), పోతేదార్ బాలాజీ (35), బాలాజీ జాదవ్ మాధవ్ (55), రాజేశ్వర్ శంకర్ రావు (43), పోటేదార్ శంకర్ (45) ఇన్నోవా కారులో సింధూ బూటాలే (45) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందారు.

అతి వేగం... ఏడుగురి ప్రాణాలు బలిగొంది

అతి వేగం... ఏడుగురి ప్రాణాలు బలిగొంది


మహాబూబ్‌నగర్ జాతీయ రహదారి కొమిరెడ్డిపల్లి వద్ద మంగళవారం ఉదయం 6.30 గంటల సమయంలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఉదయం జాతీయ రహదారిపై కొమిరెడ్డిపల్లి దగ్గర అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి అవతలవైపునకు దూసుకువెళ్లడంతో పాటు హైదరాబాద్ నుంచి కేరళ వెళ్తున్న ఇన్నోవా వాహనాన్ని ఢీకొట్టి బొల్తా పడింది.

అతి వేగం... ఏడుగురి ప్రాణాలు బలిగొంది

అతి వేగం... ఏడుగురి ప్రాణాలు బలిగొంది


మృతులను శ్రీనివాస్ బాబురావు (45), వెంకట్ సాంబాజీ (42), పోతేదార్ బాలాజీ (35), బాలాజీ జాదవ్ మాధవ్ (55), రాజేశ్వర్ శంకర్ రావు (43), పోటేదార్ శంకర్ (45) ఇన్నోవా కారులో సింధూ బూటాలే (45) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందారు.

 అతి వేగం... ఏడుగురి ప్రాణాలు బలిగొంది

అతి వేగం... ఏడుగురి ప్రాణాలు బలిగొంది


మహారాష్ట్ర వాహనంలో ఉన్నవారంతా బంధువులు, మిత్రులు కాగా, ఇన్నోవా కారులో కేరళకు చెందిన సింధూతోపాటు ఆమె భర్త ఫైజాన్, కుమారుడు అతీమ్ ప్రయాణిస్తున్నారు. ఇన్నోవాలోని ఫైజాన్, అశీమ్, టవేరా డ్రైవర్ గణేష్, శివదాస్ శంకర్ గాయపడ్డారు.

అతి వేగం... ఏడుగురి ప్రాణాలు బలిగొంది

అతి వేగం... ఏడుగురి ప్రాణాలు బలిగొంది

సంఘటనా స్ధలానికి చేరుకొన్న ఎల్ అండ్ టీ, పోలీస్ సిబ్బంది, స్ధానికులు సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో బోల్తా పడిన వాహనాన్ని లాగి వాహనంలో ఇరుకున్న మృతదేహాలను బయటకి తీశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మహారాష్ట్ర వాహనంలో ఉన్నవారంతా బంధువులు, మిత్రులు కాగా, ఇన్నోవా కారులో కేరళకు చెందిన సింధూతోపాటు ఆమె భర్త ఫైజాన్, కుమారుడు అతీమ్ ప్రయాణిస్తున్నారు. ఇన్నోవాలోని ఫైజాన్, అశీమ్, టవేరా డ్రైవర్ గణేష్, శివదాస్ శంకర్ గాయపడ్డారు.

సంఘటనా స్ధలానికి చేరుకొన్న ఎల్ అండ్ టీ, పోలీస్ సిబ్బంది, స్ధానికులు సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో బోల్తా పడిన వాహనాన్ని లాగి వాహనంలో ఇరుకున్న మృతదేహాలను బయటకి తీశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సంఘటన సమాచారాన్ని తెలుసుకున్న ఆర్టీవో కిష్టయ్య సంఘటనా స్ధలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను పరిశీలించగా టవేరా డ్రైవర్ 140 కిమీల వేగంతో డ్రైవింగ్ చేయడంతోనే వాహనం అదుపు తప్పిందని ఆర్డీవో తెలిపారు.

English summary
Two speedy car collide near mahbubnagar district national high way komireddy palli. In this accident seven people spot dead.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X