ఇద్దరు యువతుల సహజీవనం, రెండు మాసాల తర్వాత ఇలా, తల్లిదండ్రులు అలా..
ఇద్దరు యువతులు సహజీవనం చేస్తున్నారు.అయితే ఆరుమాసాల పాటు దూరంగా ఉండాలని ఇరువర్గాల తల్లిదండ్రులు కోరారు.అయితే రెండు మాసాల పాటు దూరంగా ఉన్న ఇద్దరు యువతులు కూడ ఇళ్ళ నుండి పారిపోయారు.
మంథని:ఆరు మాసాలు దూరంగా ఉంటామని అంగీకరించిన ఇద్దరు యువతులు రెండు నెలలు గడవక ముందే పోలీసులను ఆశ్రయించారు. తమను విడదీయద్దని కోరుతున్నారు.ఒకరిని విడిచి మరోకరం ఉండలేమని ఇద్దరు యువతులు పోలీసులను ఆశ్రయించారు.ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకొంది.
పెద్దపల్లి జిల్లాకు చెందిన రామగిరి మండలం సెంటినరీ కాలనీకి చెందిన గుర్రాల సింధు ఓ పాఠశాలలో నిర్వహించిన డ్యాన్స్ ప్రోగ్రామ్ తో శిరీషకుతో పరిచయమైంది.
వీరిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. వారు ఇంట్లో చెప్పకుండానే పారిపోయారు.ఇద్దరు అమ్మాయిలేనని, అయితే తామిద్దరం కలిసి ఉంటామని నిర్ణయించుకొన్నారు.అయితే ఓ టీవిఛానల్ నిర్వహించిన షో లే వారిద్దరూ పాల్గొన్నారు. తమ పరిస్థితిని వివరించారు.
అయితే గత నెల 10వ, తేదిన తన కూతురు కన్పించడం లేదంటూ శిరీష తండ్రి శంకర్ కమాన్ పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
శిరీష సెంటినరీ కాలనీకి చెందిన సింధూతో వెళ్ళిపోయిందని పోలీసులు తేల్చారు. సింధూ, శిరీష ఆచూకీ కోసం పోలీసులు గాలించగా వరంగల్ జిల్లాలోని పరకాలలోని ఓ అపార్ట్ మెంట్ లో అద్దెకు ఉంటున్నట్టు సమాచారం తెలుసుకొన్నారు.ఈ సమాచారం ఆధారంగా పోలీసులు వారిని తీసుకువచ్చారు.
ఆరుమాసాల పాటు ఇద్దరు కూడ దూరంగా ఉన్నారు.అయితే వారిద్దరూ కూడ రెండు మాసాల కంటే ఎక్కువరోజులు ఉండలేకపోయారు. వారిద్దరూ కూడ ఇళ్ళ నుండి పారిపోయారు. వారిద్దరూ పరకాలలోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు.
యువతులిద్దరూ తాము కలిసి జీవిస్తామని పోలీసులకు చెప్పారు. అయితే వారిద్దరూ కూడ మేజర్లే. దీంతో అవసరమైన సమయాల్లో విచారణకు పిలిస్తే రావాలని పోలీసులు సూచించి పంపారు.దీంతో పోలీసులు వారిని పంపారు.కమాన్ పూర్ పోలీసులు కూడ చేసేదిలేక మిన్నకున్నారు.