మహిళ హత్య: ముక్కలుగా నరికి గోనెసంచిలో
Recommended Video
హైదరాబాద్: హైద్రాబాద్ కొండాపూర్లో ఓ మహిళ మృతదేహన్ని ముక్కలు ముక్కలుగా నరికి విడి బాగాలుగా చేసి గోనేసంచిలో కట్టి బొటానికల్ గార్డెన్ సమీపంలో పడేశారు.
ఈ మేరకు హైద్రాబాద్ సమీపంలో కొండాపూర్ సమీపంలో గోనేసంచిలో ముక్కలు ముక్కలుగా నరికి పడేశారు. గోనేసంచి నుండి రక్తం కారుతోంది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటన స్థలంలో ఆధారాలను సేకరిస్తున్నారు.
రెండు రోజుల క్రితం ఈ గోనేసంచిని బొటానికల్ గార్డెన్ వద్ద వదిలి వెళ్లారని వాచ్మెన్ పోలీసులకు చెప్పారు. అయితే చెత్తను పారేసి వెళ్తున్నారని భావించినట్టు అనుమానించానని వాచ్మెన్ చెప్పారు.
గోనె సంచిలో మహిళ మృతదేహం ముక్కలు ముక్కలుగా కోసింది. గోనెసంచిలో కాళ్ళు, చేతులు, తల, మొండెం వేరు చేసి ఉన్నాయని స్థానికులు చెప్పారు.మహిళ మృతదేహనికి గాజులు మాత్రం ఉన్నాయి.
ఆ మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారా, ఇంకా ఏమైనా కారణాలున్నాయా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురైన మహిళ ఎవరనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ విషయమై శ్రీరాంసాగర్ బొటానికల్ గార్డెన్ ప్రాంతానికి వచ్చే దారిలో ని సీసీ కెమెరా పుటేజీ విజువల్స్ను పోలీసులు పరిశీలిస్తున్నారు.