వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విగ్రహాలు లేని విశిష్ట జాతర..తెలంగాణా కుంభమేళా..మేడారం మహా జాతర..రేపటి నుండే

|
Google Oneindia TeluguNews

గిరిజనుల ఆరాధ్య దైవంగా కొలుస్తున్న సమ్మక్క-సారలమ్మ మేడారం జాతర కొండాకోనా పరవశించేలా రేపటి నుండి ప్రారంభం కానుంది . జాతీయస్థాయిలో గుర్తించబడిన మేడారం జాతర ప్రతి రెండేళ్లకు ఒకసారి చాలా ఘనంగా జరుగుతోంది. వివిధ రాష్ట్రాల నుండి కోట్లాదిగా వచ్చే భక్తులతో మేడారం కుంభ మేళాను తలపిస్తుంది.

Recommended Video

Medaram Jatara Going ‘Plastic-Free’ This Year !

ఆసియా ఖండంలోనే అతిపెద్ద విగ్రహాలు లేని విశిష్టమైన సమ్మక్క సారలమ్మల జాతర చాలా ప్రశస్తమైనది. కొండా కోనల్లో గిరిజన సాంప్రదాయాల మేరకు నిర్వహించే ఈ జాతరకు ఇప్పటికే ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు వెళ్తున్నారు. ఎడ్ల బండ్ల నుండి హెలికాఫ్టర్ వరకు రవాణా సౌకర్యాలతో అటు ప్రాచీన సంస్కృతి , ఆధునిక నాగరికతల మేళవింపుగా మేడారం జాతర ఆకట్టుకుంటుంది.

 రెండేళ్లకోసారి మేడారం మహా జాతర ..వివిధ రాష్ట్రాల నుండి భక్తులు ..

రెండేళ్లకోసారి మేడారం మహా జాతర ..వివిధ రాష్ట్రాల నుండి భక్తులు ..

రెండేళ్ల కు ఒకసారి మేడారం మహా జాతర నిర్వహిస్తారు. కోట్లాది మంది ప్రజలు అమ్మవార్లను దర్శించుకుని తరిస్తారు . ప్రకృతి మొత్తం మేడారంలో సమ్మక్క , సారలమ్మల నామజపంతో , ఎదురు కోళ్ళతో , శివసత్తుల పూనకాలతో ఆద్యంతం భక్తి పారవశ్యంతో పరవశిస్తుంది. అమ్మలను దర్శించుకోవటానికి జంపన్న వాగు స్నానాలు ఆచరించటానికి సిద్ధం అయ్యింది. ఛత్తీస్ గడ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిస్సా తదితర రాష్ట్రాల నుండి భక్తులు అమ్మవారాలను దర్శించుకునేందుకు మేడారం బాట పట్టారు . సుదూర ప్రాంతాల నుండి కాలినడకన అమ్మలను దర్శించుకోటానికి భక్తులు వస్తారంటే ఆ తల్లుల మహిమ ఇంతింత చెప్పటానికి అలవికాదు.

గిరిజన సంప్రదాయాన్ని కళ్ళకు కట్టే జాతర

గిరిజన సంప్రదాయాన్ని కళ్ళకు కట్టే జాతర

గిరిజన సంప్రదాయాన్ని కళ్లకు కట్టే ‘‘సమ్మక్క-సారలమ్మ జాతర''లో అత్యంత ప్రత్యేకత ఆ తల్లులకు ఎలాంటి విరహాలు లేకపోవటం . చిలకలగుట్ట మీద నుండి సమ్మక్కను కుంకుమ భరిణి లో తెచ్చి గద్దె మీద ప్రతిష్టించటం .. మేడారంలో చాలా ఘనంగా రెండేళ్లకోసారి జరిగే ఈ మహా జాతర రేపటి నుంచే ప్రారంభం కానుంది. తెలంగాణలోని ములుగు జిల్లా కేంద్రం నుండి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలోని మేడారం ఒక గిరిజన కుగ్రామంలో జరగనున్న ఈ కుంభమేళాకు తరలి వచ్చేందుకు ఇప్పటికే అందరూ మేడారం బాట పట్టారు .. ఇప్పటికే సమ్మక్క, సారలమ్మ దీక్ష తీసుకున్న భక్తులు మేడారానికి చేరుతుండగా.. ఆ ప్రాంగణమంతా భక్త జన సందోహంతో కోలాహలంగా మారింది.

కోట్లాది భక్తుల ఆరాధ్య దైవాలు సమ్మక్క ,సారలమ్మలు

కోట్లాది భక్తుల ఆరాధ్య దైవాలు సమ్మక్క ,సారలమ్మలు

ఇప్పటికే 40 లక్షల మంది వన దేవతలను దర్శించుకున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు . జాతర జరిగే ఈ నాలుగు రోజుల్లో 60 లక్షలకు పైగా భక్తులు దర్శించుకుంటారని భావిస్తున్నారు. మేడారానికి వెళ్లేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే భక్తుల కోసం ఆర్టీసీ, రైల్వేలు ప్రత్యేక సర్వీసులు నడుపుతుండగా, తెలంగాణ పర్యటక శాఖ హెలికాప్టర్ సర్వీసులు కూడా ప్రారంభించింది.

రేపటి నుండే మహా జాతర మొదలు

రేపటి నుండే మహా జాతర మొదలు

ఇక రేపటినుండి నాలుగు రోజుల పాటు మహాజాతర కొనసాగుతుంది. రేపు 5 వతేదీనజాతరలో తొలి ప్రధాన ఘట్టం ప్రారంభం అవుతుంది . సారలమ్మ , గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు. మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను పూజారులు తీసుకొని, జంపన్న వాగును దాటి వచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. ఇక ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులును తీసుకొస్తారు. దీంతో తొలి రోజు ఘట్టం పూర్తి అవుతుంది. ఎల్లుండి (6న) సమ్మక్క గద్దె మీదకు చేరుతుంది.సమ్మక్కను చిలకల గుట్ట మీద నుంచి తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. ఇదే అత్యంత కీలకమైన ఘట్టం . కుంకుమ భరిణె రూపంలో సమ్మక్క ఆగమనం అందరూ పులకించే అద్భుత ఘట్టం .

మేడారం జనసంద్రం .. కన్నుల పండుగగా జాతర సంబరం

మేడారం జనసంద్రం .. కన్నుల పండుగగా జాతర సంబరం

చిలుకలగుట్టపై ఉన్న సమ్మక్క తల్లిని పూజారులు తీసుకొచ్చే వేడుకలో లక్షల మంది భక్తులు పాల్గొని, ఆ తల్లికి జయజయధ్వానాలు పలుకుతూ హారతులు ఇస్తారు. ఈ సమయంలో పోలీసులు, జిల్లా అధికారుల సమక్షంలో గాల్లోకి కాల్పులు జరిపి మరీ ఘన స్వాగతం పలుకుతారు. 7న సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, జంపన్న అంతా గద్దెలపై కొలువై భక్తులకు దర్శనమిస్తారు. భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఫిబ్రవరి 8న దేవతల వన ప్రవేశం ఉంటుంది. అత్యంత ఘనంగా జరిగే ఈ జాతరకు అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.వనమంతా జనసంద్రమైన వేళ అమ్మవార్ల ఆగమనం భక్తులు పూనకాలతో, శివశక్తుల చిందులతో కొనసాగే కోలాహలం కమీనీయం, రమణీయం.

English summary
Sammakka Saralamma Jatara or Medaram Jatara is a festival of honouring the Hindu goddesses, celebrated in the state of Telangana, India. Medaram maha jatara the tribal Jatara is celebrated once in two years in the month of Magha masam for a period of 4 days. Unique Jathara without idols and The maha jathara will continue for four days from tomorrow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X