కేటీఆర్ సర్! నా కొత్త ఉద్యోగం ఎలా ఉంది: ఫోటో పెట్టి ఉపాసన ట్వీట్
హైదరాబాద్: టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ తేజ సతీమణి ఉపాసన కామినేని గురువారం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు ఓ ట్వీట్ చేశారు.
'నా కొత్త జాబ్ ఎలా ఉంది కేటీఆర్ సర్? వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశం నిమిత్తం దావోస్ వెళ్లాను. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి సమాచారం అందించేందుకు ఇక్కడి ఇన్వెస్ట్ తెలంగాణ డెస్క్లో కూర్చున్నాను'. ఈ సందర్భంగా హైదరాబాద్ గురించి, తెలంగాణ గురించి ఆమె ప్రస్తావించారు.
ఉపాసన ట్వీట్
ప్రపంచంలోనే నివసించేందుకు అత్యుత్తమ స్థలాల్లో మూడవది, స్టార్టప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో హైదరాబాద్, తెలంగాణ ముందున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ గురించి గొప్పగా ట్వీట్ చేశారు.
సత్య నాదెళ్లను కలిసిన ఉపాసన
వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సమావేశంలో భాగంగా ఉపాసన ఇటీవల దావోస్ వెళ్లారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న కంపెనీలకు సమాచారం అందించి తనవంతు సాయం చేసేందుకు ఫోరంలోని తెలంగాణ డెస్క్కు కోఆర్డినేటర్గా వ్యవహరించారు. ఈ విషయాన్ని ఉపాసన ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఉపాసన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లను కలిశారు.
దావోస్ సదస్సుకు బ్రాహ్మణి కూడా
కాగా, పెట్టుబడులను ఆకర్షించేందుకు చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రాహ్మణి కూడా దావోస్ వెళ్లారు. ఏపీ నుంచి ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు, అధికారులు హాజరయ్యారు. లోకేష్ సతీమణి కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. హెరిటేజ్ ఫుడ్స్ సీఎండీగా ఆమె ఉన్న విషయం తెలిసిందే. మహిళా పారిశ్రామిక్వేత్తగా ఆమె సదస్సులో పాల్గొన్నారు.