హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యూపీ పోలీసుల అదుపులో ప్రేమజంట (ఫోటో)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రమే జంటను ఉత్తరప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇటావా పట్టణానికి చెందిన సచిన్ కుమార్ (24), నిషా శర్మ (21) ప్రేమించుకున్నారు.

వీరిద్దరి కులాలు వేరు కావడంతో వీరి పెళ్లికి అమ్మాయి తల్లితండ్రులు అంగీకరించలేదు. దీంతో వీరిద్దరూ మార్చి 18వ తేదీన బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 5లోని దేవరకొండ బస్తీలో నివసించే సచిన్ కుమార్ పెద్దమ్మ జ్ఞానదేవి ఇంటికి పారిపోయి వచ్చారు.

దీంతో మార్చి 25న నగరంలో ఉన్న రాణిగంజ్‌లోని ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. తర్వాత కొన్ని రోజులకు విషయం తెలుసుకున్న నిషా తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదని ఇటావాలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Uttar Pradesh lovers caught at Hyderabad

దీంతో అక్కడి పోలీసులు నగరానికి వచ్చారు. శుక్రవారం దేవరకొండ బస్తీలోని ఓ గదిలో తలదాచుకున్న సచిన్ కుమార్, నిషాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న బస్తీవాసులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఉత్తరప్రదేశ్‌కు చెందిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

దీంతో యూపీ పోలీసులు వీరిద్దరిపై అక్కడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని, అక్కడి పోలీస్‌స్టేషన్‌లో ప్రవేశపెట్టిన తర్వాత మాకెలాంటి సంబంధం ఉండదని వచ్చినవారికి నచ్చచెప్పడంతో వారు శాంతించారు.

English summary
Uttar Pradesh lovers caught at Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X