దేశాన్ని అవినీతిమయం చేస్తున్నారు: ప్రధాని మోడీపై వీహెచ్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ దేశాన్ని అవనీతిమయం చేస్తున్నారని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతురావు ఆరోపించారు. మోడీ వైఖరి, కేంద్ర మంత్రుల అవినీతిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా మడికొడంలో గురువారం భారీ ధర్నా నిర్వహించింది.
ఈ ధర్నాలో పాల్గొన్న వి హనుమంతురావు మీడియాతో మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్లో కుంభకోణాలు వెలుగుచూసినా మోడీ నోరు విప్పడం లేదన్నారు. ప్రధాని మోడీ ఇష్టమొచ్చినట్లు వ్వవహారిస్తూ, ప్రజాస్వామ్య విలువలను అవహేళన చేస్తున్నారని ధ్వజమెత్తారు.
గతంలో మౌనముని అని మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్ను ఎద్దేవా చేసిన ప్రధాని మోడీ, దేశంలో జరుగుతున్న కుంభకోణాలపై ఇప్పుడు తనెందుకు మౌనం వహిస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు పెద్దయెత్తున తరలివచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేశారు.