హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దేశాన్ని అవినీతిమయం చేస్తున్నారు: ప్రధాని మోడీపై వీహెచ్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ దేశాన్ని అవనీతిమయం చేస్తున్నారని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతురావు ఆరోపించారు. మోడీ వైఖరి, కేంద్ర మంత్రుల అవినీతిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా మడికొడంలో గురువారం భారీ ధర్నా నిర్వహించింది.

ఈ ధర్నాలో పాల్గొన్న వి హనుమంతురావు మీడియాతో మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కుంభకోణాలు వెలుగుచూసినా మోడీ నోరు విప్పడం లేదన్నారు. ప్రధాని మోడీ ఇష్టమొచ్చినట్లు వ్వవహారిస్తూ, ప్రజాస్వామ్య విలువలను అవహేళన చేస్తున్నారని ధ్వజమెత్తారు.

V Hanumantha rao fires on prime minister narendra modi

గతంలో మౌనముని అని మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్‌ను ఎద్దేవా చేసిన ప్రధాని మోడీ, దేశంలో జరుగుతున్న కుంభకోణాలపై ఇప్పుడు తనెందుకు మౌనం వహిస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమానికి కాంగ్రెస్‌ శ్రేణులు పెద్దయెత్తున తరలివచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేశారు.

English summary
Congress ya sabha leader V Hanumantha rao comments on prime minister narendra modi over correption.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X