కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవర్టులు, రాహుల్కి చెబుతా: వీహెచ్ వ్యాఖ్యల కలకలం
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు తాజాగా చేపట్టిన ఎన్నికల కమిటీలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం నగరంలోని పార్క్ హయత్ హోటల్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాంనబీ ఆజాద్ను కలిసి నిరసన వ్యక్తం చేశారు.
ప్రచార కమిటీ ఛైర్మన్గా నియమిస్తారని ఆశించానని, కానీ, వ్యూహ, ప్రణాళికా కమిటీ ఛైర్మన్గా నియమించారని వ్యాఖ్యానించారు. ఆ పదవి తన సీనియార్టీకి తగిన పదవి కాదని అసహనం వ్యక్తం చేశారు వీహెచ్. 1989లో ప్రచార కమిటీ ఛైర్మన్గా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన సమర్థుడినని వీహెచ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
బ్రోకర్లు, జైలుకెళ్లిన వారికి ప్రాధాన్యతా? శనిలా కుంతియా: రేవంత్పై కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవర్గులున్నారని ఆరోపించారు. తనకు పదవి ఇస్తే కేసీఆర్ను ఓడిస్తానని కోవర్టులు భయపడుతున్నారని, ఆ కోవర్టుల వివరాలు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి చెబుతానని వీహెచ్ అన్నారు. తాను ఇంట్లో కూర్చుండే వ్యక్తిని కాదని అన్నారు.