వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందెవరు? ప్రధానికి చెడ్డ పేరు తెచ్చేందుకే: కాంగ్రెస్‌పై వెంకయ్య ఫైర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పార్లమెంటు సమావేశాలను అడ్డుకోవడమే విపక్షాలు పనిగా పెట్టుకున్నారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మండిపడ్డారు. హైదరాబాద్‌లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

ఆరోపణలు చేసేముందు ఆలోచించుకోవాలని... అలా చేయనందుకే కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానికి చెడ్డపేరు తేవాలన్న యోచనతోనే కాంగ్రెస్‌ పార్టీ అర్థంలేని ఆరోపణలు చేస్తోందన్నారు.

Venkaiah fires at Congress

నేషనల్ కేసుతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని వెంకయ్య స్పష్టం చేశారు. ప్రధానిని అవమానించేలా కాంగ్రెస్ చర్యలున్నాయని మండిపడ్డారు. గుజరాత్ సిఎంగా ఉన్న సమయంలో సిట్ ముందు ఎలాంటి హంగామా లేకుండా మోడీ హాజరయ్యారని, కాంగ్రెస్‌లా ర్యాలీలు తీయలేదని మండిపడ్డారు. ఆయన నిజాయితీని రుజువు చేసుకున్నారని చెప్పారు.

ప్రతిపక్షాలను వేధించిందెవరు, ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిందెవరు? అని కాంగ్రెస్ పార్టీపై వెంకయ్యనాయుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడ్ని జైల్లో పెట్టి పార్లమెంటు సమావేశాలను జరిపిందెవరని ఆయన నిలదీశారు.

English summary
Union Minister Venkaiah Naidu on Sunday fired at Congress Party for National Herald case issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X