ప్రపంచ తెలుగు మహాసభలను ప్రారంభించిన వెంకయ్య నాయుడు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమయ్యాయి. ఎల్బీ స్టేడియంలో పాల్కురికి ప్రాంగణం, బమ్మెర పోతన వేదికపై సభలను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు.
విశిష్ట అతిథులుగా తెలంగాణ గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర రావు తదితరులు హాజరయ్యారు. కేసీఆర్ ఈ సభలకు అధ్యక్షత వహిస్తున్నారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ప్రధాన వేదికలు ఉన్నాయి.
అంతకుముందు, హైదరాబాద్ విచ్చేసిన వెంకయ్య నాయుడుకి బేగంపేట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. గవర్నర్ నరసింహన్, తెలంగాణ రాష్ట్రమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, నాయిని నర్సింహా రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.
Comments
English summary
Vice President Venkaiah Naidu inaugurates prapancha telugu mahasabhalu 2017.
Story first published: Friday, December 15, 2017, 17:38 [IST]