5 సంవత్సరాల ఆకాంక్ష ఇప్పుడు నెరవేరుతోంది.. ఉపరాష్ట్ర్రపతి వెంకయ్యనాయుడు
గత అయిదు సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్ర్రాల మధ్య స్నేహభావం పెంపోంది సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటున్నానని, అయితే అది సాధ్యం కాలేదని ఉప రాష్ట్ర్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. కాని తాను కోరుకుంటున్నట్టుగా రెండు తెలుగు రాష్ట్ర్రాల సీఎంలు కలసి మాట్లాడుకోవడం సమస్యల పై చర్చించుకుంటున్నారని అయన అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి జగన్ తోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రాష్ట్ర్రాల సమస్యలపై కలిసి చర్చించుకోవడం శుభ పరిమాణమని అయన అన్నారు. ఈనేపథ్యంలోనే వారి చర్చలు సఫలం కావాలని ఆయన ఆకాంక్షంచారు.
విశాఖ పట్టణం ఓ కార్యక్రమంలో పాల్గోనేందుకు వచ్చిన వెంకయ్యనాయుడు మీడీయాతో మాట్లాడారు. ఈనేపథ్యంలోనే తెలుగు రాష్ట్ర్రాల ముఖ్యమంత్రులు జగన్ , కేసీఆర్లు కలిసి మాట్లాడుకోవడం శుభపరిమాణమని అన్నాడు. వారిద్దరు కలిసి సోదరభావంతో రాష్ట్ర్రాల సమస్యలపై కలిసి చర్చించుకోవడం కూడ స్వాగతించదగ్గ పరిమాణమని అన్నారు.
ఇక గత ఐదేళ్లనుండి రెండు రాష్ట్ర్రాల మధ్య తేలని వివాదల విషయంలో కూడ చర్చల ద్వార వెంటనే పరిష్కారం కోసం ప్రయత్నాలు చేయడంపై ముఖ్య మంత్రులను వెంకయ్యనాయుడు అభిందించారు. అయితే రెండు రాష్ట్ర్రాల సమస్యల విషయంలో కేంద్రం జోక్యం లేకుండా సమస్యలను పరిష్కరించుకోగలిగితే ఇంకా మంచిదని హితవు పలికారు.
కాగా ఇటివల ఏపి ముఖ్యమంత్రి జగన్ ,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్లు గతంలో కలిసి విభజన హమీలను నెరవేర్చుకునేందుకు కేంద్రంతో చర్చలు చేపడుతున్నారు. దీంతోపాటు గతంలో ఉన్న వైరుధ్యం వలే కాకుండా ప్రతి అంశలో కలిసి నిర్ణయాలు తీసుకునేందుకు సన్నద్దమవుతున్నారు. దీంతో రెండు రాష్ట్ర్రాల మధ్య స్నేహభావం మరింత పెంపోందించేదిశగా అడుగులు పడుతున్నాయి.