వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అన్నాడీఎంకే పార్టీని నడిపించండి: శశికళను కలిసిన విజయశాంతి
దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళను శనివారం నాడు ప్రముఖ సినీ నటి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి కలిశారు.
హైదరాబాద్/చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళను శనివారం నాడు ప్రముఖ సినీ నటి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి కలిశారు. చెన్నైలోని పోయెస్ గార్డెన్లో చిన్నమ్మతో సమావేశమయ్యారు.
అన్నాడీఎంకే పార్టీని ముందు ఉండి నడిపించాలని ఈ సందర్భంగా శశికళను విజయశాంతి కోరారు. అంతకుముందు మెరీనా బీచ్ ఒడ్డున ఉన్న జయలలిత సమాధిని విజయశాంతి దర్శించుకున్నారు. పూలమాల వేసి నివాళులు అర్పించారు. జయలలిత మృతి తీరని లోటు అన్నారు.
కాగా, జయలలిత ఈ నెల 5వ తేదీన రాత్రి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె మృతి అనంతరం ప్రస్తుతం అనధికారికంగా పార్టీ పగ్గాలు శశికళ చేతుల్లోకి వచ్చాయి. త్వరలో ఆమెను పార్టీ చీఫ్గా ప్రకటించనున్నారు.
Comments
vijayasanthi jayalalithaa sasikala admk poes garden aiadmk o panneerselvam tamil nadu జయలలిత అన్నాడీఎంకే తమిళనాడు పన్నీరు సెల్వం పోయెస్ గార్డెన్ శశికళ విజయశాంతి
English summary
Telangana Congress leader Vijayasanthi meets Sasikala in poes gardern.
Story first published: Saturday, December 17, 2016, 17:10 [IST]