తన కూతురును ప్రభుత్వ మైనారీటీ స్కూల్లో చేర్పించిన వికారాబాద్ కలెక్టర్ అయోషా...!
తెలంగాణలోని మరో కలెక్టర్ ప్రభుత్వ విద్యావ్యవస్థకు ఆదర్శంగా నిలిచారు. తెలంగాణలోని మారుమూల జిల్లాకు కలెక్టర్గా ఉన్న మస్రత్ ఖానం అయోషా తన కుమార్తే సబీష్ రాణీయాను ప్రభుత్వ మైనార్టీ గురుకుల పాఠశాలలో చేర్పించారు. దీంతో ఆమే తెలంగాణ గురుకుల విద్యాలయాల పట్ల తనకున్న ఆదర్శాన్ని, విశ్వాసాన్ని చాటుకున్నారు.
ప్రభుత్వ విద్య అంటే చాల మందికి చిన్నచూపుగా మారింది..అప్పులు చేసైనా సరే ప్రైవేట్ కాన్వేంట్లలో తమ పిల్లలకు విద్యను అందించాలని భావిస్తారు. ఇక ప్రభుత్వ టీచర్లు, ఉద్యోగులు సైతం ఇదే బాట పడతారు. దీంతో ప్రభుత్వం ఇచ్చే జీతాలు తీసుకుని ప్రభుత్వ విద్యా వ్యవస్థ మీద పూర్తిగా నమ్మకం లేక పోవడంతో ప్రైవేట్ విద్యా వ్యవస్థ మూడు పూవులు ఆరు కాయలుగా విరజీల్లుతుంది.మొత్తం మీద ప్రభుత్వంలో ఉద్యోగం చేసే చిన్నపాటీ ఉద్యోగి కూడ ప్రభుత్వ స్కూల్లో తమ పిల్లలను చేర్పించడానికి ఇష్టపడరు .
కాని జిల్లా స్థాయిలో ఉండి, ప్రభుత్వ ఉద్యోగులకు బాస్గా ఉన్న వికారాబాద్ కలెక్టర్ మాత్రం అందరికి ఆదర్శంగా నిలిచారు. ప్రజలతోపాటు రాష్ట్ర్ర ప్రభుత్వ విధానంపై ఆమే పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఈనేపథ్యంలోనే బుధవారం రాష్ట్ర్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లు ప్రారంభమైన నేపథ్యంలో ఆమే తన కూతురును మైనారీటీ గురుకుల స్కూళ్లో అయిదవ తరగతిలో చేర్పించింది.