ఎక్స్ప్రెస్ రైలును ఢీకొన్న ఎంఎంటీఎస్: వైరల్ అవుతున్న వీడియో ఇదే
Recommended Video
హైదరాబాద్: కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర సోమవారం ఉదయం రెండు ఢీకొన్న విషయం తెలిసిందే. ఆగివున్న ఎక్స్ప్రెస్ రైలును ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎంఎంటీఎస్ లోకో పైలట్ చంద్రశేఖర్ కేబిన్లో ఇరుక్కుని తీవ్రంగా గాయపడ్డారు.
సుమారు 8గంటలపాటు శ్రమించిన సహాయక బృందాలు అతడిని బయటికి తీశాయి. ఆ వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతని పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు కూడా గాయపడ్డారు.
కాగా, ఈ రైలు ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రమాదం జరిగిన స్థలానికి సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డైన ఫుటేజీనే ఇది.
#Kachiguda #MmtsTrain accident video pic.twitter.com/Xr6koJm5Vq
— syeraa (@syeraaupdates) November 11, 2019
ఆగివున్న ఎక్స్ప్రెస్ రైలును ఢీకొట్టిన ఎంఎంటీఎస్ రైలు వెనుక భాగం కాస్త పైకి లేచి పక్కకు ఒరిగింది. దీంతో ఎంఎంటీఎస్ రైలులో ఉన్న పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఒక్కసారిగా ప్రమాదం జరగడంతో ప్రయాణికులంతా బెంబేలెత్తిపోయారు. రైలు దిగి బయటకు పరుగులు పెట్టారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది.