వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్‌ను కలిసిన పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యువనేత, జూబ్లీహిల్స్ మాజీ శాసన సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు. ఆయన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు.

తన తండ్రి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనాలని కేసీఆర్‌ను కోరినట్లు ఆయన తెలిపారు. ఐమాక్స్ ఎదురుగా ఉన్న పార్కుకు పీజేఆర్ పేరు పెట్టాలని కోరినట్లు తెలిపారు. దీనికి కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. డిసెంబర్ 28న తేదీన పీజేఆర్ ఏడో వర్ధంతి ఉంది.

Vishnu meets CM KCR

ఐమాక్స్‌కు ఎదురుగా ఉన్న పార్కుకు పీజేఆర్ పేరు పెట్టాలని గతంలో ఎన్నోసార్లు గత ముఖ్యమంత్రుల వద్ద ప్రస్తావించినా ఎవరు స్పందించలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీ ఆర్ మాత్రం తన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారని సంతోషం వ్యక్తం చేశారు.

కాగా, ఇటీవల కాంగ్రెస్ యువనేత, ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిల మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయమై విష్ణు పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన అరెస్టుకు రంగం సిద్ధం చేయగా, ఆయన కోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో విష్ణు తెరాసలోకి వెళ్తారనే ఊహాగానాలు కూడా వినిపించాయి.

English summary
Former MLA Vishnuvardhan Reddy meets Telangana CM KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X