వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఓట్లు నాకే పడ్డాయి, అయితే గెలిచేది మాత్రం వైసీపి అభ్యర్థి :కేఏ పాల్
కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో విన్నూత ప్రచారం చేసి ఓటర్లతోపాటు మీడియాను ఆకట్టుకున్న ఆయన ఎన్నికలకు ముందు చాల జిమ్మిక్కులే చేశారు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడిన అది పెద్ద సంచలనం అయ్యాయి. ఈనేపథ్యంలోనే చాల సంధర్బంలో తానే అధికారంలోకి వస్తానని కూడ చెప్పారు. తాజగా ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పోటి చేసిన నరసాపురంలో ఆయన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి అయినా రఘరామక్రిష్ణ రాజు గెలుస్తున్నారని చెప్పారు. అయితే నరసాపురం లోక్సభ పరిధిలో 60 శాతం ఓట్లు తనకే పడ్డాయి, కాని ఈవిఎంల్లో అవినీతి వల్ల వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయని పాల్ చెప్పారు. కాగా ఎన్నికల కమీషన్ ప్రధాని మోదీ చేతుల్లో ఉందని ఆరోపించారు . కాగా నాతో యువత వస్తే అవినీతి పై యుద్దం చేస్తానని అన్నారు.
Comments
English summary
KA Paul once again made sensational comments,60% people voted me in narsapuram but ysrcp mp candidate going win ,because of evm's
Story first published: Friday, April 12, 2019, 19:16 [IST]