హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కబళించిన మృత్యువు: నిద్రలోనే అనంతలోకాలకు, ముగ్గురు చిన్నారుల మృతి

|
Google Oneindia TeluguNews

ఎప్పటిలాగే ఆ చిన్నారులు పడుకొన్నారు. కానీ వారు సూర్యోదయాన్ని చూడలేకపోయారు. గోడ రూపంలో మృత్యువు వచ్చి తీసుకెళ్లింది. గోడ కూలడంతో ముగ్గురు చిన్నారులు చనిపోయారు. హైదరాబాద్‌లో జరిగిన ఘటన తల్లిదండ్రులకు శోకాన్ని మిల్చిలింది. నిన్నటివరకు ఆడుకొన్న తమ చిన్నారులు లేరనే విషయాన్ని ఆ తల్లిదండ్రులకు బంధువుల జీర్ణించుకోలేకపోతున్నారు.

హబీబ్‌నగర్ పరిధి అప్టల్‌సాగర్ రహదారి మాన్‌గిరి బస్తీలో ఆరేళ్ల రోహిణి కుటుంబం నివసిస్తోంది. ఆమె చెల్లెల్లు సారిక (3), నాలుగు నెలల పావనితో ఉంటున్నారు. అమ్మ నాన్న ప్రేమనురాగాలతో చక్కగా సాగిపోతున్న వారి జీవితాన్ని గోడ చీధ్ర చేసింది. గురువారం రాత్రి ముగ్గురు అక్కాచెల్లెళ్లు నిద్రలోకి జారుకున్నారు. కానీ పక్కనే ఉన్న గోడ కుప్పకూలిపోయింది. నిద్రలో ఉన్న చిన్నారులు కళ్లు మూసుకొని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

wall collapse: three childs are dead in hyderabad

గోడ కూలడంతో అక్కాచెల్లెళ్లు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలంలోనే చనిపోయారు. చిన్నారుల మృతితో పేరెంట్స్ శోకసంద్రంలో మునిగిపోయారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గోడ కూలడంపై కేసు నమోదు చేశామని.. సంబంధిత యాజమానిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టంచేశారు. కానీ ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురి ప్రాణాలను గోడ కబళించడంతో.. ఆ ఫ్యామిలీ గుండెలవిసేలా రోదిస్తోంది.

English summary
three children are dead in hyderabad habibnagar due to wall collapse.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X