‘బాహుబలి 2 ’ ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం 500 టికెట్లు బుక్ చేసిన కలెక్టర్
బాహుబలి 2 సినిమా చూసేందుకు చివరికి ఐఏఎస్లు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం మొత్తం 500 టికెట్లు కొనుగోలు చేయడం హాట్ టాపిక
హైదరాబాద్: కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఇప్పుడు ఎవర్ని కదిలించినా ఇదే ప్రశ్న. ఈ విషయం తెలుసుకునేందుకు సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు.. సగటు అభిమాని నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ నిరీక్షిస్తున్నారు.
బాహుబలి-2 విడుదల దగ్గర పడటంతో తెలుగు రాష్ట్రాలకు సినీ ఫీవర్ పట్టుకుంది. ఓ వైపు టికెట్ల వేట మొదలైంది.. ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం అభిమానులు ఎంతో అత్రుతగా నిరీక్షిస్తున్నారు. టికెట్ ధర ఎంతయినా ఫర్లేదు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాల్సిందే అని ఫిక్సయ్యారు.
బాహుబలి 2 సినిమా ప్రభావం ఎంతలా ఉందంటే.. చివరికి ఐఏఎస్లు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి ఈనెల 28న హన్మకొండలోని ఏషియన్ శ్రీదేవి థియేటర్లో ఈ సినిమాకు టికెట్లు బుక్ చేసుకున్నారు.
ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం మొత్తం 500 టికెట్లు ఆమె కొనుగోలు చేయడం హాట్ టాపిక్గా మారింది. ఈ స్పెషల్ షోకు ఎవరికి ఆహ్వానం దక్కుతుందా? అని పలువురు ఎదురుచూస్తున్నారు. ఈ యంగ్ కలెక్టర్ ఈ షోకి అధికారులను కూడా ఆహ్వానిస్తారా? అనే చర్చ జరుగుతోంది.
స్థానిక నాయకులకు తన స్నేహితులతోపాటు కలెక్టరేట్ అధికారుల కుటుంబాలకు ఆమ్రపాలి ఈ స్పెషల్ షోకు ఆహ్వానం పంపనున్నారని తెలుస్తోంది. ఓ కలెక్టర్ ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం ఇంతలా ఆసక్తి చూపుతుంటే సగటు అభిమాని పరిస్థితి ఏంటి? అని అంతా ఆశ్చర్యానికి లోనవుతున్నారు.